యాప్నగరం

ముంబై ఓటమితో ప్రీతి జింతా ఆనందం.. వీడియో వైరల్

ఢిల్లీ చేతిలో ముంబై ఓడటంతో పంజాబ్ సహయజమాని ప్రీతి జింతా ‘నాకెంతో సంతోషంగా ఉంది’ అని పక్కనున్న వ్యక్తితో అంటున్న వీడియో వైరల్‌గా మారింది.

Samayam Telugu 21 May 2018, 3:33 pm
చివరి మ్యాచ్‌లో చెన్నై చేతిలో ఓడిన పంజాబ్ ప్లే ఆఫ్ అవకాశాలను చేజార్చుకుంది. అంతకు ముందు ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఓడటంతో.. పంజాబ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా కనిపించారు. ధోనీ సేనపై 53 పరుగుల తేడాతో గెలిస్తే.. ప్లేఆఫ్ చేరే అవకాశం ఉండటమే దీనికి కారణం. కానీ పంజాబ్ బ్యాట్స్‌మెన్ స్థాయికి తగ్గ ఆటతీరు కనబర్చలేదు. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు ఢిల్లీ చేతిలో ముంబై ఓడటంతో పంజాబ్ సహ యజమాని ప్రీతి జింతా తెగ హ్యాపీగా కనిపించింది.
Samayam Telugu preeti zinta1


ముంబై ప్లేఆఫ్ చేరకపోవడంతో.. నవ్వుతూప్రీతి కనిపించిన దృశ్యాలు కెమెరాకు చిక్కాయి. కానీ ఆవిడ మాటలు మాత్రం రికార్డ్ కాలేదు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రీతి జింతా స్పందించింది.

‘‘ముంబై ఓడితేనే పంజాబ్ తదుపరి దశకు వెళ్లే ఛాన్స్ ఉంది. చెన్నై చేతిలో మేం ఓడటంతో రాజస్థాన్ ఆనందించి ఉంటుంది. మేం ఓడిపోవడం వల్ల రాజస్థాన్ ప్లేఆఫ్ చేరడమే దీనికి కారణం. ఐపీఎల్ చివరి ఘట్టంలో మన విజయాలే కాదు.. ఇతర జట్ల ఓటములను కూడా పరిగణనలోకి తీసుకోవాల’’ని ప్రీతి ట్వీట్ చేసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.