యాప్నగరం

IPL 2023: చెపాక్‌లో లాస్ట్ బాల్‌కి ఓడిన చెన్నై.. పోరాడి గెలిచిన పంజాబ్

Chennai Super Kings టీమ్‌కి సొంతగడ్డపై ఆదివారం అవమానకర ఓటమి ఎదురైంది. 200 పరుగుల భారీ స్కోరు నమోదు చేసినా.. పేలవ బౌలింగ్ కారణంగా ఆ లక్ష్యాన్ని చెన్నై కాపాడుకోలేకపోయింది. చివరి ఓవర్‌లో లాస్ట్ బంతి వరకూ పోరాడిన పంజాబ్ 4 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది.

Authored byరాజేంద్ర గాలేటి | Samayam Telugu 30 Apr 2023, 7:48 pm

ప్రధానాంశాలు:

  • చెపాక్‌లో ఓడిపోయిన చెన్నై సూపర్ కింగ్స్
  • చివర్లో తెలివిగా ఆడి గెలిచిన పంజాబ్ కింగ్స్
  • మ్యాచ్‌ని మలుపుతిప్పిన లివింగ్‌స్టోన్ హిట్టింగ్
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu csk vs pbks
జితేశ్ శర్మ
ఐపీఎల్ 2023 (IPL 2023)లో మరో మ్యాచ్ అభిమానుల్ని మునివేళ్లపై నిలబెట్టింది. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌(CSK)పై చివరి బంతికి పంజాబ్ కింగ్స్ (PBKS) గెలుపొందింది. మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 4 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేయగా.. లక్ష్యాన్ని లాస్ట్ బాల్‌కి పంజాబ్ కింగ్స్ 201/6తో ఛేదించింది. సీజన్‌లో 8వ మ్యాచ్ ఆడిన పంజాబ్‌కి ఇది నాలుగో విజయంకాగా.. చెన్నై సూపర్ కింగ్స్‌కి మూడో ఓటమి.
201 పరుగుల ఛేదనలో పంజాబ్ కింగ్స్‌ ఫస్ట్ నుంచి దూకుడుగా ఆడుతూ వచ్చింది. ఓపెనర్లు శిఖర్ ధావన్ (28), ప్రభసిమ్రాన్ సింగ్ (42: 24 బంతుల్లో 4x4, 2x6) తొలి వికెట్‌కి 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఆ తర్వాత వచ్చిన లివింగ్‌స్టోన్ (40: 24 బంతుల్లో 1x4, 4x6) మిడిల్ ఓవర్లలో భారీ సిక్సర్లు బాదేయగా.. శామ్ కరన్ (29: 20 బంతుల్లో 1x4, 1x6), జితేశ్ శర్మ (21: 10 బంతుల్లో 2x4, 1x6) బంతులు, పరుగుల మధ్య అంతరం తగ్గించేలా హిట్టింగ్ చేశారు. దాంతో చివర్లో పంజాబ్ విజయానికి 6 బంతుల్లో 9 పరుగులు అవసరం అయ్యాయి. ఈ దశలో లాస్ట్ ఓవర్ వేసిన పతిరన బౌలింగ్‌లో జాగ్రత్తగా ఆడిన షారూక్ ఖాన్ (2 నాటౌట్), సికిందర్ రజా (13 నాటౌట్) వరుసగా 1, L1, 0, 2, 2, 3 పరుగులు చేసి పంజాబ్‌ని గెలిపించారు. లాస్ట్ బాల్‌కి 3 పరుగులు అవసరం అవగా.. బ్యాక్‌వర్డ్ స్వ్కేర్ లెగ్ దిశగా బంతిని హిట్ చేసిన రజా.. షారూక్‌తో కలిసి చకచకా మూడు పరుగులు చేసేశాడు. ఆ బంతిని చెన్నై ఫీల్డర్ థీక్షణ బౌండరీ వరకూ వెంటాడుతూ వెళ్లాడు.

మ్యాచ్‌లో అంతకముందు టాస్ గెలిచిన చెన్నై ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. ఆ జట్టు ఓపెనర్ దేవాన్ కాన్వె (92 నాటౌట్: 52 బంతుల్లో 16x4, 1x6) దూకుడుగా ఆడేయగా.. ఆఖర్లో క్రీజులోకి వచ్చిన ధోనీ (13 నాటౌట్: 4 బంతుల్లో 2x6) చివరి రెండు బంతులకి సిక్స్‌లు కొట్టాడు. దాంతో చెన్నై 200 పరుగుల మార్క్‌ని చేరుకోగలిగింది. పంజాబ్ బౌలర్లలో అర్షదీప్, కరన్, రాహుల్ చాహర్, సికిందర్ రజా ఒక్కో వికెట్ పడగొట్టారు.
రచయిత గురించి
రాజేంద్ర గాలేటి
గాలేటి రాజేంద్ర సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ స్పోర్ట్స్, సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాస్తుంటారు. క్రికెట్ అంటే అమితమైన ఇష్టం. మ్యాచ్‌లకి సంబంధించి ఆసక్తికరమైన కథనాల్ని అందిస్తుంటారు. ఈయనకి జర్నలిజంలో 10 ఏళ్లకి పైగా అనుభవం ఉంది. గతంలో ఈనాడు.నెట్‌లో పనిచేశారు. అంతకముందు జర్నలిజంలో పీజీ చేయడంతో పాటు ఈనాడు జర్నలిజం స్కూల్‌లో శిక్షణ పొందారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.