యాప్నగరం

IPL: కవ్వించే కళ్లతో కట్టిపడేసిన ‘సూపర్ ఓవర్ గర్ల్’.. ఈ పిల్ల ఎంత తెలివైందంటే?

IPL Double Super Over మ్యాచ్‌లో పంజాబ్, ముంబై ఆటగాళ్ల ఆటతోపాటు ఓ మిస్టరీ గర్ల్ చూపులు కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఓవర్ నైట్‌లో ఆమె సెలబ్రిటీగా మారిపోయింది.

Samayam Telugu 21 Oct 2020, 12:59 pm
ఐపీఎల్ చరిత్రలో తొలిసారి జరిగిన డబుల్ సూపర్ ఓవర్ మ్యాచ్‌ను క్రికెట్ ఫ్యాన్స్ ఎప్పటికీ మర్చిపోలేరు. ఈ మ్యాచ్‌లో విజయం కోసం ముంబై, పంజాబ్ పోరాడిన తీరు అందర్నీ ఆకట్టుకుంది. రెండో సూపర్ ఓవర్లో గెలిచిన పంజాబ్.. రెండు పాయింట్లను దక్కించుకుంది. ఈ డబుల్ సూపర్ ఓవర్ సందర్భంగా ఇరు జట్ల మధ్య పోరే కాదు.. స్టేడియంలో ఓ మిస్టరీ గర్ల్ సైతం అందర్నీ ఆకట్టుకుంది. అమాయకపు చూపులతో గోర్లు కొరుకుతూ.. కుర్రాళ్ల మతి పోగొట్టింది.
Samayam Telugu raina lalwani | Image: IPL/Twitter


దీంతో ఆమె ఎవరో తెలుసుకోవడం కోసం కుర్రాళ్లు తెగ ఆసక్తి చూపించారు. చివరకు ఆమె తన గురించి బయటపెట్టింది. మీరంతా వెతుకుతున్న మిస్టరీ గర్ల్ తానేనని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా ప్రపంచానికి తెలిపింది. తన గురించి వస్తోన్న మీమ్స్‌ను సరదాగా తీసుకున్న ఈ భామ పేరు రైనా లల్వానీ.
కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కు సపోర్ట్ చేసిన లల్వానీ.. ఆ సూపర్ ఓవర్ మ్యాచ్ తర్వాత ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయింది. అంతకు ముందు ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను 2500 మంది మాత్రమే అనుసరించగా.. మూడు రోజుల్లోనే ఆమె ఫాలోవర్ల సంఖ్య 62.5 వేలకు చేరింది. ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో తన గురించి తాను ‘ఐపీఎల్ సూపర్ ఓవర్ గాళ్’గా రాసుకోవడం గమనార్హం.
ఈ మ్యాచ్‌లో కెమెరామెన్ పనితీరు అద్భుతమని.. కొందరు కొనియాడగా.. మరికొందరేమో.. ఆమె ఎవరికి సపోర్ట్ చేస్తుందో తెలీదుగానీ.. నేను కూడా ఆ పిల్ల సపోర్ట్ చేసిన జట్టుకే మద్దతిస్తామని సరదాగా ట్వీట్లు చేశారు. ‘బాయ్స్ ఫస్ట్ సూపర్ ఓవర్ చూడటం కోసం మెలకువగా ఉన్నారు. మెన్ రెండో సూపర్ ఓవర్ చూడటం కోసం మెలకువగా ఉన్నారు. లెజెండ్స్ మాత్రం ఈ అమ్మాయిని మళ్లీ చూడటం కోసం మెలకువతో ఉన్నారు’ అని ఓ నెటిజన్ సరదాగా కామెంట్ చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.