యాప్నగరం

IPL 2021: రాజస్థాన్ రాయల్స్ టీమ్‌లోకి కుమార సంగక్కర.. కీలక బాధ్యతలు

ఐపీఎల్ 2020 సీజన్‌లో కెప్టెన్‌గానే కాకుండా బ్యాట్స్‌మెన్‌గా కూడా విఫలమైన స్టీవ్‌స్మిత్‌ని వేలంలోకి రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంఛైజీ వదిలేసింది. తాజాగా ఆ జట్టు డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా..?

Samayam Telugu 24 Jan 2021, 7:59 pm
ఐపీఎల్ 2020 సీజన్‌లో పేలవ ప్రదర్శనతో నిరాశపరిచిన రాజస్థాన్ రాయల్స్.. ఐపీఎల్ 2021 సీజన్ కోసం ఇప్పటికే నుంచే కసరత్తులు మొదలెట్టేసింది. ఈ క్రమంలో సాహసోపేతంగా కెప్టెన్ స్టీవ్‌స్మిత్‌ని వేలంలోకి వదిలేసిన రాజస్థాన్ ఫ్రాంఛైజీ.. కెప్టెన్‌గా సంజు శాంసన్‌ని నియమించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. తాజాగా రాజస్థాన్ రాయల్స్ టీమ్ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా శ్రీలంక దిగ్గజ క్రికెటర్‌ కుమార సంగక్కరని ఆ ఫ్రాంఛైజీ నియమించింది. ఈ ఏడాది ఏప్రిల్- మే నెలలో ఐపీఎల్ 2021 సీజన్ జరగనుంది.
Samayam Telugu Sangakkara, Rajasthan Royals (Image Source: Twitter)


ఐపీఎల్ 2021 సీజన్‌కి సంబంధించిన ఆటగాళ్ల వేలం ఫిబ్రవరిలో జరిగే సూచనలు కనిపిస్తుండగా.. సంగక్కర పర్యవేక్షణలో రాజస్థాన్ ఫ్రాంఛైజీ క్రికెటర్లని కొనుగోలు చేయనుంది. అంతేకాకుండా.. టీమ్ వ్యూహాలు, తుది జట్టు ఎంపికని కూడా సంగక్కర పరిశీలించనున్నాడు. నాగ్‌పూర్‌లోని రాయల్స్ అకాడమీలో టోర్నీకి ముందు ఆటగాళ్ల‌కి సంగక్కరతో స్పెషల్ క్లాస్‌లు కూడా ఇప్పించాలని రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంఛైజీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

శ్రీలంక తరఫున దాదాపు 16 ఏళ్లు అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లాడిన కుమార సంగక్కర 28,000పైచిలుకు పరుగులు చేశాడు. వికెట్ కీపర్‌గానూ సరికొత్త రికార్డ్‌లు నెలకొల్పిన ఈ దిగ్గజ క్రికెటర్.. టెస్టుల్లో అప్పట్లో అత్యధిక సగటుతో అందర్నీ ఆశ్చర్యపరిచాడు. స్టీవ్‌స్మిత్, ఆకాశ్ సింగ్, అనిరుధ్ జోషి, అంకిత్ రాజ్‌పుత్, థామస్, శాశాంక్ సింగ్, టామ్ కరన్, వరుణ్ అరోన్‌లను వేలంలోకి వదిలేసిన రాజస్థాన్ రాయల్స్ రూ.34.85 కోట్లతో ఐపీఎల్ 2021 సీజన్ వేలంలోకి వెళ్లనుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.