యాప్నగరం

Rashid Khan: ధోనీ, కోహ్లి, ఏబీ వికెట్స్ సంతృప్తినిచ్చాయి..!

ఐపీఎల్ 2018 సీజన్‌లో మహేంద్రసింగ్ ధోనీ, విరాట్ కోహ్లి, ఏబీ డివిలియర్స్ వికెట్లు తీయడం తనకు ఎక్కువ సంతృప్తినిచ్చిందని సన్‌రైజర్స్ హైదరాబాద్

Samayam Telugu 29 May 2018, 12:40 pm
ఐపీఎల్ 2018 సీజన్‌లో మహేంద్రసింగ్ ధోనీ, విరాట్ కోహ్లి, ఏబీ డివిలియర్స్ వికెట్లు తీయడం తనకు ఎక్కువ సంతృప్తినిచ్చిందని సన్‌రైజర్స్ హైదరాబాద్ స్పిన్నర్ రషీద్ ఖాన్ వెల్లడించాడు. గత ఆదివారం హైదరాబాద్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో గెలుపొందిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మూడోసారి ఐపీఎల్ టైటిల్‌ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. టోర్నీ ఆరంభం నుంచి సన్‌రైజర్స్ జట్టు బౌలింగ్‌ భారాన్ని మోస్తూ వచ్చిన రషీద్ ఖాన్.. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లోనూ రాణించి ఒంటిచేత్తో జట్టుని ఫైనల్‌కి చేర్చాడు. కానీ.. ఫైనల్లో జట్టు ఓడిపోవడం బాధించినా.. టోర్నీలో తన ప్రదర్శనపై ఈ అఫ్గానిస్థాన్ స్పిన్నర్ సంతృప్తి వ్యక్తం చేశాడు.
Samayam Telugu rashid khan getting ms dhoni virat kohli and ab de villiers wickets very satisfying
Rashid Khan: ధోనీ, కోహ్లి, ఏబీ వికెట్స్ సంతృప్తినిచ్చాయి..!


‘టోర్నీలో విరాట్ కోహ్లి, ఏబీ డివిలియర్స్‌తో పాటు మహేంద్రసింగ్ ధోనీ వికెట్ తీయడం ఎక్కువ సంతృప్తినిచ్చింది. నా కెరీర్‌లో వీరి వికెట్లే బెస్ట్‌ అని నేను భావిస్తున్నా. ఎందుకంటే ఈ ముగ్గురు క్రికెటర్లూ.. స్పిన్‌ బౌలింగ్‌‌ని సమర్థంగా ఎదుర్కోగలరు. అలాంటి వారిని ఔట్ చేయడం కెరీర్‌లో ఓ మధుర జ్ఞాపకం’ అని రషీద్ ఖాన్ వెల్లడించాడు. ఐపీఎల్ 2018 సీజన్‌లో మొత్తం 17 మ్యాచ్‌లాడిన రషీద్ ఖాన్ 21 వికెట్లు పడగొట్టాడు. అతని ఎకానమీ 6.73 మాత్రమేకాగా.. బెస్ట్ 3/19గా ఉండటం విశేషం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.