యాప్నగరం

Harbhajan Singh: బెంగళూరుని 70కే కుప్పకూల్చిన చెన్నై స్పిన్నర్లు

ఓపెనర్‌గా వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లి (6: 12 బంతుల్లో) ఇన్నింగ్స్‌ నాలుగో ఓవర్‌లోనే వికెట్ చేజార్చుకోగా.. ఆ తర్వాత వచ్చిన మొయిన్ అలీ (9: 8 బంతుల్లో 1x6), ఏబీ డివిలియర్స్ (9: 10 బంతుల్లో) కూడా తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరిపోయారు

Samayam Telugu 23 Mar 2019, 9:42 pm
చెన్నై సూపర్ కింగ్స్‌తో చెపాక్ వేదికగా ఈరోజు జరుగుతున్న తొలి ఐపీఎల్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు పేలవంగా 70 పరుగులకే ఆలౌటైంది. స్పిన్నర్లు హర్భజన్ సింగ్ (3/20), ఇమ్రాన్ తాహిర్ (3/9) ధాటికి వరుసగా వికెట్లు చేజార్చుకున్న బెంగళూరు ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. ఓపెనర్‌ పార్థీవ్ పటేల్ (29: 35 బంతుల్లో 2x4) 18వ ఓవర్ వరకూ క్రీజులో నిలిచి ఆఖరి వికెట్‌గా వెనుదిరిగాడు.
Samayam Telugu RCb


ఓపెనర్‌గా వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లి (6: 12 బంతుల్లో) ఇన్నింగ్స్‌ నాలుగో ఓవర్‌లోనే వికెట్ చేజార్చుకోగా.. ఆ తర్వాత వచ్చిన మొయిన్ అలీ (9: 8 బంతుల్లో 1x6), ఏబీ డివిలియర్స్ (9: 10 బంతుల్లో) కూడా తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరిపోయారు. ఈ ముగ్గురినీ వరుస ఓవర్లలో స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఔట్ చేశాడు. ఈ దశలో ఆదుకుంటాడని ఆశించిన యువ హిట్టర్ హెట్‌మెయర్ (0) లేని పరుగు కోసం ప్రయత్నించి రనౌటవగా.. శివమ్ దూబే (2), గ్రాండ్ హోమ్ (4), నవదీప్ షైనీ (2) ఉమేశ్ యాదవ్ (1) అలా వచ్చి.. ఇలా వెళ్లిపోయారు. దీంతో.. 17.1 ఓవర్లలోనే బెంగళూరు జట్టు 70 పరుగులకి ఆలౌటైంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.