యాప్నగరం

వార్నర్ గైర్హాజరీలో.. కోహ్లి సరికొత్త రికార్డ్

రాయల్ ఛాలెంజర్స్ కెప్టెన్ విరాట్ కోహ్లి ఐపీఎల్‌లో మరో అరుదైన రికార్డ్ నెలకొల్పాడు. ఐపీఎల్‌లో ఐదేళ్లపాటు ఏటా 500కిపైగా పరుగులు చేసిన ఏకైక ప్లేయర్‌గా కోహ్లి నిలిచాడు.

Samayam Telugu 16 May 2018, 6:05 pm
రాయల్ ఛాలెంజర్స్ కెప్టెన్ విరాట్ కోహ్లి ఐపీఎల్‌లో మరో అరుదైన రికార్డ్ నెలకొల్పాడు. ఐపీఎల్‌లో ఐదేళ్లపాటు ఏటా 500కిపైగా పరుగులు చేసిన ఏకైక ప్లేయర్‌గా కోహ్లి నిలిచాడు. పంజాబ్‌పై విరాట్ 48 రన్స్ చేయడంతో ఆర్‌సీబీ 10 వికెట్ల తేడాతో గెలుపొందింది. అజేయంగా బెంగళూరును గెలిపించిన కెప్టెన్ ఈ సీజన్లో 500కిపైగా పరుగులు పూర్తి చేసుకున్నాడు. కోహ్లి తొలిసారిగా 2011లో ఐపీఎల్‌లో 557 పరుగులు చేశాడు. 2013లో 634 పరగులు చేసిన విరాట్.. 2015లో 505 రన్స్ చేయగా.. 2016లో ఏకంగా 973 పరుగులు చేయడం గమనార్హం. 2016లో కోహ్లి రెండు సెంచరీలు బాదాడు.
Samayam Telugu kohli abd


ఇప్పటి వరకూ డేవిడ్ వార్నర్ నాలుగు సీజన్లలో 500కిపైగా పరుగులు చేయగా.. సురేశ్ రైనా, క్రిస్ గేల్, గౌతమ్ గంభీర్ 3 సీజన్లలో ఈ ఫీట్ సాధించారు.

ఐపీఎల్ ఆరంభం నుంచి బెంగళూరు తరఫునే ఆడుతున్న కోహ్లి.. ఒకే జట్టు తరఫున అన్ని సీజన్లు ఆడిన ప్లేయర్‌గా, లీగ్‌లో ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డ్ నెలకొల్పిన సంగతి తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.