ఐపీఎల్ 2020 సీజన్లో మళ్లీ సూపర్ ఓవర్ ద్వారా మ్యాచ్ ఫలితం తేలింది. దుబాయ్ వేదికగా సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్.. ఏబీ డివిలియర్స్ (55 నాటౌట్: 24 బంతుల్లో 4x4, 4x6), అరోన్ ఫించ్ (52: 35 బంతుల్లో 7x4, 1x6), దేవ్దత్ పడిక్కల్ (54: 40 బంతుల్లో 5x4, 2x6) హాఫ్ సెంచరీలు బాదడంతో 3 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యఛేదనలో ఇషాన్ కిషన్ (99: 58 బంతుల్లో 2x4, 9x6), కీరన్ పొలార్డ్ (60 నాటౌట్: 24 బంతుల్లో 3x4, 5x6) సంచలన ఇన్నింగ్స్ ఆడటంతో ముంబయి ఇండియన్స్ కూడా 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. స్కోర్లు సమమవడంతో సూపర్ ఓవర్ నిర్వహించగా.. బెంగళూరు టీమ్ అలవోక విజయాన్ని అందుకుంది. తాజా సీజన్ రెండో మ్యాచ్లోనే ఢిల్లీ క్యాపిటల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మధ్య సూపర్ ఓవర్ జరిగిన విషయం తెలిసిందే.
సూపర్ ఓవర్లో ఫస్ట్ ముంబయి బ్యాటింగ్ చేయగా.. కీరన్ పొలార్డ్, హార్దిక్ పాండ్య బ్యాటింగ్కి వచ్చారు. ఫాస్ట్ బౌలర్ నవదీప్ సైనీ విసిరిన తొలి బంతికి పొలార్డ్ సింగిల్ తీసివ్వగా.. రెండో బంతికి పాండ్య కూడా సింగిల్ తీశాడు. ఆ తర్వాత మూడో బంతి డాట్ అవగా.. నాలుగో బంతిని పొలార్డ్ బౌండరీకి తరలించాడు. కానీ.. ఐదో బంతికి అతను ఔటవగా.. ఆరో బంతికి బైస్ రూపంలో ఒక పరుగు వచ్చింది. మొత్తంగా.. ముంబయి 7/1తో సూపర్ ఓవర్లో నిలిచింది.
సూపర్ ఓవర్లో 8 పరుగుల లక్ష్య ఛేదనని బెంగళూరు బ్యాట్స్మెన్ ఏబీ డివిలియర్స్, కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆరంభించారు. జస్ప్రీత్ బుమ్రా విసిరిన తొలి బంతికి ఏబీ సింగిల్ తీయగా.. రెండో బంతికి కోహ్లీ కూడా ఒక పరుగు చేశాడు. ఇక మూడో బంతిని హుక్ షాట్ ఆడేందుకు డివిలియర్స్ ప్రయత్నించగా.. అది బ్యాట్కి కనెక్ట్ అవలేదు. కానీ.. నాలుగో బంతిని బౌండరీకి తరలించిన ఏబీ.. ఐదో బంతికి సింగిల్ తీసివ్వగా.. ఆఖరి బంతికి ఒక పరుగు అవసరమైన దశలో విరాట్ కోహ్లీ బౌండరీ బాదేశాడు. ఐపీఎల్ కెరీర్లో ముంబయి తరఫున జస్ప్రీత్ బుమ్రా సూపర్ ఓవర్లో బౌలింగ్ చేయడం ఇది మూడోసారికాగా.. తొలిసారి ఆ జట్టు ఓడిపోయింది.
సూపర్ ఓవర్లో ఫస్ట్ ముంబయి బ్యాటింగ్ చేయగా.. కీరన్ పొలార్డ్, హార్దిక్ పాండ్య బ్యాటింగ్కి వచ్చారు. ఫాస్ట్ బౌలర్ నవదీప్ సైనీ విసిరిన తొలి బంతికి పొలార్డ్ సింగిల్ తీసివ్వగా.. రెండో బంతికి పాండ్య కూడా సింగిల్ తీశాడు. ఆ తర్వాత మూడో బంతి డాట్ అవగా.. నాలుగో బంతిని పొలార్డ్ బౌండరీకి తరలించాడు. కానీ.. ఐదో బంతికి అతను ఔటవగా.. ఆరో బంతికి బైస్ రూపంలో ఒక పరుగు వచ్చింది. మొత్తంగా.. ముంబయి 7/1తో సూపర్ ఓవర్లో నిలిచింది.
సూపర్ ఓవర్లో 8 పరుగుల లక్ష్య ఛేదనని బెంగళూరు బ్యాట్స్మెన్ ఏబీ డివిలియర్స్, కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆరంభించారు. జస్ప్రీత్ బుమ్రా విసిరిన తొలి బంతికి ఏబీ సింగిల్ తీయగా.. రెండో బంతికి కోహ్లీ కూడా ఒక పరుగు చేశాడు. ఇక మూడో బంతిని హుక్ షాట్ ఆడేందుకు డివిలియర్స్ ప్రయత్నించగా.. అది బ్యాట్కి కనెక్ట్ అవలేదు. కానీ.. నాలుగో బంతిని బౌండరీకి తరలించిన ఏబీ.. ఐదో బంతికి సింగిల్ తీసివ్వగా.. ఆఖరి బంతికి ఒక పరుగు అవసరమైన దశలో విరాట్ కోహ్లీ బౌండరీ బాదేశాడు. ఐపీఎల్ కెరీర్లో ముంబయి తరఫున జస్ప్రీత్ బుమ్రా సూపర్ ఓవర్లో బౌలింగ్ చేయడం ఇది మూడోసారికాగా.. తొలిసారి ఆ జట్టు ఓడిపోయింది.