భువీని సైతం వదలకుండా పంత్ విధ్వంసం.. కానీ!
ఢిల్లీ యువ బ్యాట్స్మెన్ రిషబ్ పంత్ సన్రైజర్స్ బౌలర్లతో ఓ ఆటాడుకున్నాడు. ఫోర్లు, సిక్స్ల మోత మోగిస్తూ అజేయ శతకంతో సత్తా చాటాడు.
Samayam Telugu 11 May 2018, 10:51 am
సన్రైజర్స్ చేతిలో ఓటమిపాలైన ఢిల్లీ డేర్డెవిల్స్ ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించింది. ఢిల్లీ ఓడినా యువ బ్యాట్స్మెన్ రిషబ్ పంత్ అద్భుత శతకంతో ఆకట్టుకున్నాడు. 63 బంతుల్లో 128 పరుగులతో నాటౌట్గా నిలిచిన పంత్.. 15 ఫోర్లు, 7 సిక్సర్లతో చెలరేగాడు. తద్వారా ఐపీఎల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన భారత బ్యాట్స్మెన్గా రికార్డ్ నెలకొల్పాడు. 36 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న పంత్.. తర్వాత కళ్లు చెదిరే షాట్లు ఆడాడు.
ఏ బౌలర్ను వదలకుండా బాదిన పంత్.. ప్రపంచంలోనే అత్యుత్తమ టీ20 బౌలరయిన భువీ బౌలింగ్లోనూ సిక్స్లతో విరుచుకుపడ్డాడు. భువీ వేసిన ఇన్నింగ్స్ 18వ ఓవర్లో రెండు ఫోర్లు, ఒక సిక్స్ కొట్టిన పంత్.. ఆ ఓవర్లో 18 పరుగులు పిండుకొని సెంచరీ పూర్తి చేశాడు. ఇక భువీ వేసిన చివరి ఓవర్లో తొలి బంతికి మ్యాక్స్వెల్ ఔట్ కాగా.. తర్వాతి బంతుల్ని వరుసగా 4,4,6,6,6 బాదిన పంత్ ఆ ఓవర్లో 26 పరుగులు రాబట్టాడు.
ఐపీఎల్లో సెంచరీ సాధించిన రెండో పిన్న వయస్కుడిగా రికార్డ్ నెలకొల్పిన పంత్ ( 20 ఏళ్ల 218 రోజులు) మనీష్ పాండే (19 ఏళ్ల 253 రోజులు) తర్వాతి స్థానంలో నిలిచాడు. ఈ క్రమంలోనే ఐపీఎల్లో వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్న పిన్న వయస్కుడిగా రికార్డ్ నెలకొల్పాడు. ఇద్దరు బ్యాట్స్మెన్ రనౌట్ కావడానికి కారణమైనందునే మరింత బాధ్యతగా ఆడానని మ్యాచ్ అనంతరం పంత్ చెప్పాడు.
పంత్ సంచలన ఇన్నింగ్స్ ఆడినప్పటికీ.. ధావన్ (92 నాటౌట్), విలియమ్సన్ (83 నాటౌట్) భారీ భాగస్వామ్యం ముందు 187 పరుగుల లక్ష్యం సరిపోలేదు. దీంతో పంత్ ఖాతాలో ఎవరూ కోరుకోని రికార్డ్ చేరింది.
ఓ బ్యాట్స్మెన్ 128 రన్స్ చేసినా అతడి జట్టు ఓడటం ఐపీఎల్ చరిత్రలోనే ఇది తొలిసారి. గతంలో ఈ రికార్డ్ ఆండ్రూ సైమండ్స్ పేరిట ఉండేది. సైమండ్స్ 2008లో రాయల్ ఛాలెంజర్స్పై 117 పరుగులతో నాటౌట్గా నిలిచినప్పటికీ డెక్కన్ ఛార్జర్స్ను గెలిపించలేకపోయాడు.
2014లో సాహా కోల్కతాపై 115 పరుగులతో నాటౌట్గా నిలిచినప్పటికీ.. పంజాబ్ ఓటమిపాలైంది. ఆమ్లా ముంబై ఇండియన్స్పై 104* రన్స్ చేశాడు. కానీ అతడి జట్టయిన పంజాబ్ ఓడింది.
ఏ బౌలర్ను వదలకుండా బాదిన పంత్.. ప్రపంచంలోనే అత్యుత్తమ టీ20 బౌలరయిన భువీ బౌలింగ్లోనూ సిక్స్లతో విరుచుకుపడ్డాడు. భువీ వేసిన ఇన్నింగ్స్ 18వ ఓవర్లో రెండు ఫోర్లు, ఒక సిక్స్ కొట్టిన పంత్.. ఆ ఓవర్లో 18 పరుగులు పిండుకొని సెంచరీ పూర్తి చేశాడు. ఇక భువీ వేసిన చివరి ఓవర్లో తొలి బంతికి మ్యాక్స్వెల్ ఔట్ కాగా.. తర్వాతి బంతుల్ని వరుసగా 4,4,6,6,6 బాదిన పంత్ ఆ ఓవర్లో 26 పరుగులు రాబట్టాడు.
ఐపీఎల్లో సెంచరీ సాధించిన రెండో పిన్న వయస్కుడిగా రికార్డ్ నెలకొల్పిన పంత్ ( 20 ఏళ్ల 218 రోజులు) మనీష్ పాండే (19 ఏళ్ల 253 రోజులు) తర్వాతి స్థానంలో నిలిచాడు. ఈ క్రమంలోనే ఐపీఎల్లో వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్న పిన్న వయస్కుడిగా రికార్డ్ నెలకొల్పాడు. ఇద్దరు బ్యాట్స్మెన్ రనౌట్ కావడానికి కారణమైనందునే మరింత బాధ్యతగా ఆడానని మ్యాచ్ అనంతరం పంత్ చెప్పాడు.
పంత్ సంచలన ఇన్నింగ్స్ ఆడినప్పటికీ.. ధావన్ (92 నాటౌట్), విలియమ్సన్ (83 నాటౌట్) భారీ భాగస్వామ్యం ముందు 187 పరుగుల లక్ష్యం సరిపోలేదు. దీంతో పంత్ ఖాతాలో ఎవరూ కోరుకోని రికార్డ్ చేరింది.
ఓ బ్యాట్స్మెన్ 128 రన్స్ చేసినా అతడి జట్టు ఓడటం ఐపీఎల్ చరిత్రలోనే ఇది తొలిసారి. గతంలో ఈ రికార్డ్ ఆండ్రూ సైమండ్స్ పేరిట ఉండేది. సైమండ్స్ 2008లో రాయల్ ఛాలెంజర్స్పై 117 పరుగులతో నాటౌట్గా నిలిచినప్పటికీ డెక్కన్ ఛార్జర్స్ను గెలిపించలేకపోయాడు.
2014లో సాహా కోల్కతాపై 115 పరుగులతో నాటౌట్గా నిలిచినప్పటికీ.. పంజాబ్ ఓటమిపాలైంది. ఆమ్లా ముంబై ఇండియన్స్పై 104* రన్స్ చేశాడు. కానీ అతడి జట్టయిన పంజాబ్ ఓడింది.