ఐపీఎల్ 2023 (IPL 2023) సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) టీమ్ టాప్ ఆర్డర్ మరోసారి మెరిసింది. ముంబయి ఇండియన్స్ (MI)తో వాంఖడే వేదికగా మంగళవారం రాత్రి జరుగుతున్న మ్యాచ్లో గ్లెన్ మాక్స్వెల్ (68: 33 బంతుల్లో 8x4, 4x6), డుప్లెసిస్ (65: 41 బంతుల్లో 5x4, 3x6) హాఫ్ సెంచరీలు బాదడంతో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు టీమ్ 6 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. ముంబయి బౌలర్లలో జేసన్ బెరండ్రాఫ్ మూడు వికెట్లు పడగొట్టగా.. కామెరూన్ గ్రీన్, కుమార్ కార్తికేయ, క్రిస్ జోర్దాన్ తలో వికెట్ పడగొట్టారు. మ్యాచ్లో టాస్ గెలిచిన ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దాంతో డుప్లెసిస్తో కలిసి ఆర్సీబీ ఇన్నింగ్స్ని స్టార్ట్ చేసిన విరాట్ కోహ్లీ (1: 4 బంతుల్లో) ఫస్ట్లోనే ఔటైపోయాడు. ఆ తర్వాత నెం.3లో వచ్చిన అనుజ్ రావత్ (6) కూడా సింగిల్ డిజిట్ స్కోరుకే ఔటైపోగా.. ఈ ఇద్దరినీ బెరండ్రాఫ్ పెవిలియన్ బాట పట్టించాడు. కానీ.. నెం.4లో వచ్చిన గ్లెన్ మాక్స్వెల్ క్రీజులోకి వచ్చినప్పటి నుంచి హిట్టింగ్ చేసేశాడు. మరోవైపు డుప్లెసిస్ కూడా జోరందుకోవడంతో.. ఈ ఇద్దరూ మూడో వికెట్కి 120 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. కానీ.. టీమ్ స్కోరు 136 వద్ద మాక్స్వెల్, 146 వద్ద డుప్లెసిస్ ఔటైపోయారు.
మిడిల్ ఓవర్లలో మహిపాల్ లూమర్ (1) తేలిపోగా.. చివర్లో దినేశ్ కార్తీక్ (30: 18 బంతుల్లో 4x4, 1x6), కేదార్ జాదవ్ (12 నాటౌట్: 10 బంతుల్లో 1x4), వానిందు హసరంగ (12 నాటౌట్: 8 బంతుల్లో 2x4) ఫర్వాలేదనిపించారు. దాంతో ఆర్సీబీ 199 పరుగులు చేయగలిగింది.
మిడిల్ ఓవర్లలో మహిపాల్ లూమర్ (1) తేలిపోగా.. చివర్లో దినేశ్ కార్తీక్ (30: 18 బంతుల్లో 4x4, 1x6), కేదార్ జాదవ్ (12 నాటౌట్: 10 బంతుల్లో 1x4), వానిందు హసరంగ (12 నాటౌట్: 8 బంతుల్లో 2x4) ఫర్వాలేదనిపించారు. దాంతో ఆర్సీబీ 199 పరుగులు చేయగలిగింది.