మహిళల ప్రీమియర్ లీగ్లో ముంబయి ఇండియన్స్ జట్టుకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మహిళల జట్టు 156 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచిన బెంగళూరు జట్టు కెప్టెన్ స్మృతి మంధాన మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ తీసుకుంది. అయితే, ముంబయి బౌలర్ల దాటికి ఆ జట్టు క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. చివరికి 18.4 ఓవర్లలో 155 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. దూకుడుగా ఇన్నింగ్స్ ప్రారంభించిన స్మృతి మంధాన.. 17 బంతుల్లో 23 పరుగులు (5 ఫోర్లు) చేసి హేలే బౌలింగ్లో భారీ షాట్కు ప్రయత్నించి వాంగ్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. అంతకుముందే డివిన్ 16 పరుగులు (11 బంతుల్లో, 2 ఫోర్లు, 1 సిక్స్) చేసి పెవీలియన్ చేరింది. ఆ తర్వాత దిశా కసత్, హీథర్ నైట్ డకౌట్గా వెనుదిరిగారు. మధ్యలో రిచా గోష్ 26 బంతుల్లో 28 పరుగులు (3 ఫోర్లు, 1 సిక్స్) చేసి ఇన్నింగ్స్ పునర్నిర్మించింది.
చివర్లో కనికా అహుజా (22 పరుగులు, 13 బంతుల్లో, 3 ఫోర్లు, 1 సిక్స్), శ్రేయంకా పాటిల్ (23 పరుగులు, 15 బంతుల్లో, 4 ఫోర్లు), మెగాన్ స్కట్ (20 పరుగులు, 14 బంతుల్లో, 3 ఫోర్లు) దూకుడుగా ఆడటంతో బెంగళూరు జట్టుకు గౌరవప్రదమైన స్కోరు దక్కింది.
ముంబయి బౌలర్లలో హేలీ మ్యాథ్యూస్ 3 వికెట్లు తీసింది. సాయిక్ ఇషాక్, అమేలియా కేర్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. పూజా వస్త్రాకర్, నాట్ బ్రంట్ చెరో వికెట్ తీశారు.
చివర్లో కనికా అహుజా (22 పరుగులు, 13 బంతుల్లో, 3 ఫోర్లు, 1 సిక్స్), శ్రేయంకా పాటిల్ (23 పరుగులు, 15 బంతుల్లో, 4 ఫోర్లు), మెగాన్ స్కట్ (20 పరుగులు, 14 బంతుల్లో, 3 ఫోర్లు) దూకుడుగా ఆడటంతో బెంగళూరు జట్టుకు గౌరవప్రదమైన స్కోరు దక్కింది.
ముంబయి బౌలర్లలో హేలీ మ్యాథ్యూస్ 3 వికెట్లు తీసింది. సాయిక్ ఇషాక్, అమేలియా కేర్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. పూజా వస్త్రాకర్, నాట్ బ్రంట్ చెరో వికెట్ తీశారు.