యాప్నగరం

సంజు శాంసన్‌ హిట్టింగ్‌కి నెటిజన్లు ఫిదా.. సెంచరీపై ప్రశంసల వర్షం

ఐపీఎల్ 14 ఏళ్ల చరిత్రలో కెప్టెన్‌గా ఆడిన ఫస్ట్ మ్యాచ్‌లో సంజు శాంసన్ తరహాలో ఏ క్రికెటర్ కూడా హిట్టింగ్ చేయలేదు. కానీ.. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ ఓడిపోయింది. అయితే నెటిజన్లు మాత్రం..?

Samayam Telugu 13 Apr 2021, 8:54 am
ఐపీఎల్ 2021 సీజన్‌లో ఆడిన ఫస్ట్ మ్యాచ్‌లోనే రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ శతకంతో చెలరేగాడు. పంజాబ్ కింగ్స్‌తో ముంబయిలోని వాంఖడే స్టేడియం వేదికగా సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో 222 పరుగుల లక్ష్యఛేదనలో రాజస్థాన్ టీమ్‌ని సంజు శాంసన్ (119: 63 బంతుల్లో 12x4, 7x6) చివరి బంతి వరకూ ముందుండి నడిపించాడు. కానీ.. ఈ మ్యాచ్‌లో ఆఖరికి పంజాబ్ టీమ్ 4 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. చివరి బంతికి రాజస్థాన్ విజయానికి 5 పరుగులు అవసరమైన దశలో సిక్స్ కొట్టబోయిన సంజు శాంసన్.. బౌండరీ లైన్ వద్ద దీపక్ హుడా చేతికి చిక్కాడు.
Samayam Telugu Sanju Samson century (Pic Source: Twitter)



ఇన్నింగ్స్ మొదటి ఓవర్‌లోనే బెన్‌స్టోక్స్ (0) ఔటవడంతో క్రీజులోకి వచ్చిన సంజు శాంసన్.. ఇన్నింగ్స్ మూడో ఓవర్‌ నుంచే టాప్‌గేర్‌లోకి వెళ్లిపోయాడు. టార్గెట్‌ భారీగా ఉండటంతో.. ఏ దశలోనూ అతను ఉదాసీనత కనబర్చలేదు. సహచరుల నుంచి పెద్దగా సపోర్ట్ లభించకపోయినా.. కెప్టెన్‌గా చివరి బంతి వరకూ అతను పోరాడిన తీరుకి క్రికెట్ ప్రపంచం ఫిదా అయిపోయింది. ఈ క్రమంలో 33 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్‌ని అందుకున్న సంజు శాంసన్.. ఆ తర్వాత 21 బంతుల్లోనే సెంచరీ మార్క్‌ని చేరుకోడం విశేషం.


ఐపీఎల్‌లో సంజు శాంసన్‌కి ఇది మూడో శతకం. గతంలో 2017, 2019 ఐపీఎల్ సీజన్లలోనూ సంజు శాంసన్ సెంచరీలు నమోదు చేశాడు. ఆ రెండు మ్యాచ్‌ల్లోనూ 102 పరుగులే చేసిన సంజు శాంసన్.. ఈ మ్యాచ్‌లో 119 పరుగులు చేయడం ద్వారా.. తన కెరీర్ బెస్ట్ స్కోరుని మెరుగుపర్చుకున్నాడు. 14 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో కెప్టెన్‌గా ఆడిన ఫస్ట్ మ్యాచ్‌లోనే సెంచరీ సాధించిన మొదటి క్రికెటర్‌గా సంజు శాంసన్‌ అరుదైన రికార్డ్ నెలకొల్పాడు.









తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.