యాప్నగరం

Virat Kohliకి వార్నింగ్ ఇచ్చి మరీ బౌల్డ్ చేసిన శ్రేయాస్ గోపాల్

ఇన్నింగ్స్ 7వ ఓవర్ వేసిన లెగ్ స్పిన్నర్ శ్రేయాస్ గోపాల్ బౌలింగ్‌లో బంతిని అంచనా వేయడంలో విరాట్ కోహ్లీ తడబడగా.. బ్యాట్ ఎడ్జ్ తాకిన బంతి నేరుగా వెళ్లి వికెట్లను గీరాటేసింది.

Samayam Telugu 5 Apr 2019, 5:45 pm
ఐపీఎల్ 2019 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ వరుసగా నాలుగో మ్యాచ్‌లోనూ ఫెయిలయ్యాడు. రాజస్థాన్ రాయల్స్‌తో జైపూర్ వేదికగా మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో పార్థీవ్ పటేల్‌తో కలిసి బెంగళూరు ఇన్నింగ్స్‌ ఆరంభించిన విరాట్ కోహ్లి (23: 25 బంతుల్లో 3x4) పేలవరీతిలో క్లీన్ బౌల్డయ్యాడు.
Samayam Telugu 23


ఇన్నింగ్స్ 7వ ఓవర్ వేసిన లెగ్ స్పిన్నర్ శ్రేయాస్ గోపాల్ బౌలింగ్‌లో బంతిని అంచనా వేయడంలో విరాట్ కోహ్లీ తడబడగా.. బ్యాట్ ఎడ్జ్ తాకిన బంతి నేరుగా వెళ్లి వికెట్లను గీరాటేసింది. అయితే.. ఈ ఓవర్‌లోని రెండో బంతికే కోహ్లీ ఔటవ్వాల్సింది. శ్రేయాస్ గోపాల్ గూగ్లీ విసరగా.. ఆ బంతిని అతికష్టంమీద విరాట్ కోహ్లీ డిఫెన్స్ చేయగలిగాడు. కానీ.. అది కూడా బ్యాట్ ఎడ్జ్‌కే తాకినా.. రాజస్థాన్ ఫీల్డర్లు ఎల్బీడబ్ల్యూ కోసం అప్పీల్ చేశారు. అయితే.. ఫీల్డ్ అంపైర్ ఆ అప్పీల్‌ని తిరస్కరించాడు. కానీ.. తర్వాత బంతిని కూడా శ్రేయాస్ గోపాల్ అదే లైన్ అండ్ లెంగ్త్‌లో విసిరాడు. అయితే.. ఈసారి కోహ్లీ అదుపు తప్పాడు. ఆ బంతిని డ్రైవ్ చేసేందుకు ప్రయత్నించగా.. అప్పటికే ఆలస్యమైపోయింది.. బ్యాట్ ఎడ్జ్‌ తాకిన బంతిని నేరుగా వెనక్కి వెళ్లి బెయిల్స్‌ను ఎగరగొట్టింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.