యాప్నగరం

శాంసన్ సిక్స్‌ల మోత.. దద్దరిల్లిన చిన్నస్వామి స్టేడియం

సంజూ శాంసన్ సిక్సర్ల మోతతో బెంగళూరు చిన్నస్వామి స్టేడియం దద్దరిల్లింది.

Samayam Telugu 15 Apr 2018, 6:35 pm
సంజూ శాంసన్ సిక్సర్ల మోతతో చిన్నస్వామి స్టేడియం దద్దరిల్లింది. 34 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసిన శాంసన్.. ఆ తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ముఖ్యంగా చివరి మూడు ఓవర్లలో శాంసన్ విశ్వరూపం చూపాడు. తాను ఎదుర్కొన్న చివరి ఏడు బంతులను వరుసగా.. 6 6 6 4 4 6 6 1గా మలిచి ఔరా అనిపించాడు. మ్యాచ్ పూర్తయ్యే సమయానికి పది సిక్స్‌లు, 2 ఫోర్లు బాదిన శాంసన్ 45 బంతుల్లో 92 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఐపీఎల్‌లో అతడికి ఇదే అత్యధిక స్కోరు కావడం గమనార్హం.
Samayam Telugu sanju samson


శాంసన్ వీర బాదుడు కారణంగా రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. ఈ సీజన్లో అత్యధిక స్కోరును రాజస్థాన్ నమోదు చేసింది. ఓ దశలో 9 ఓవర్లలో 68/2తో నిలిచిన రాజస్థాన్‌.. మిడిలార్డర్ దూకుడుతో భారీ స్కోరు నమోదు చేసింది. రాయల్ ఛాలెంజర్స్‌పై రాజస్థాన్‌కు ఇదే అత్యధిక స్కోరు కావడం గమనార్హం. ఆఖరి ఐదు ఓవర్లలో రాజస్థాన్ 88 పరుగులు పిండుకుంది.

ఆరంభంలో నిలకడగా ఆడిన శాంసన్.. తొలి 11 బంతుల్లో 12 పరుగులు మాత్రమే చేశాడు. క్రీజులో నిలదొక్కుకున్నాక పరుగుల వేగం పెంచాడు. ఖేజ్రోలియా బౌలింగ్‌లో చివరి రెండు బంతుల్ని సిక్స్‌గా మలిచిన శాంసన్.. వోక్స్ బౌలింగ్‌లో ఓ సిక్స్, రెండు ఫోర్లు బాదాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.