ఐపీఎల్ 2021 సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు మరోసారి మెరిశారు. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా బుధవారం జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ జట్టుని 19.4 ఓవర్లలోనే 120 పరుగులకి సన్రైజర్స్ హైదరాబాద్ ఆలౌట్ చేసింది. ఆ జట్టులో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (22: 25 బంతుల్లో 2x4), హిట్టర్ షారూక్ ఖాన్ (22: 17 బంతుల్లో 2x6) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేశారు. సన్రైజర్స్ హైదారబాద్ బౌలర్లలో ఖలీల్ అహ్మద్ మూడు వికెట్లు పడగొట్టగా.. అభిషేక్ శర్మ రెండు, భువనేశ్వర్ కుమార్, సిద్ధార్థ కౌల్, రషీద్ ఖాన్ తలో వికెట్ తీశారు. మ్యాచ్లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే.. మయాంక్ అగర్వాల్తో కలిసి ఇన్నింగ్స్ని ప్రారంభించిన రాహుల్ (4: 6 బంతుల్లో) 4వ ఓవర్లోనే భువనేశ్వర్ కుమార్ బౌలింగ్లో కేదార్ జాదవ్కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అనంతరం వచ్చిన క్రిస్గేల్ (15: 17 బంతుల్లో 2x4) గేర్ మార్చేలోపే స్పిన్నర్ రషీద్ ఖాన్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా ఔటైపోయాడు. ఇక నెం.4లో వచ్చిన నికోలస్ పూరన్ (0) వరుసగా నాలుగో మ్యాచ్లోనూ ఫెయిలయ్యాడు. లేని పరుగు కోసం ప్రయత్నించిన నికోలస్ పూరన్.. డేవిడ్ వార్నర్ డైరెక్ట్ త్రో కారణం రనౌటయ్యాడు. ఈ దశలో హెన్రిక్యూస్ (14: 17 బంతుల్లో)తో కలిసి కాసేపు ఓపికగా ఆడిన దీపక్ హుడా (13: 11 బంతుల్లో 2x4) పంజాబ్ని ఆదుకునేలా కనిపించాడు. కానీ.. టీమ్ స్కోరు 63 వద్ద అతను ఔటవడంతో పంజాబ్ మళ్లీ ఒత్తిడిలో పడిపోయింది.
ఏడో స్థానంలో క్రీజులోకి వచ్చిన షారూక్ ఖాన్ రెండు భారీ సిక్సర్లతో పంజాబ్ శిబిరంలో ఉత్సాహం నింపాడు. అయితే.. అతనికి ఫాబియన్ అలెన్ (6: 11 బంతుల్లో), మురగన్ అశ్విన్ (9: 10 బంతుల్లో 1x4) నుంచి ఆశించిన మేర సపోర్ట్ లభించలేదు. ఈ ఇద్దరూ కనీసం స్ట్రైక్ని కూడా రొటేట్ చేయలేకపోయారు. దాంతో.. బంతికో పరుగుని కూడా పంజాబ్ రాబట్టలేకపోయింది. దాంతో.. ఇన్నింగ్స్ 19వ ఓవర్లో గేర్ మార్చేందుకు ప్రయత్నించిన షారూక్ ఖాన్.. సిక్స్ కొట్టే ప్రయత్నంలో బౌండరీ లైన్ వద్ద ఫీల్డర్ అభిషేక్ శర్మ చేతికి చిక్కాడు. ఆఖర్లో మహ్మద్ షమీ (3: 3 బంతుల్లో), అర్షదీప్ సింగ్ (1 నాటౌట్: 2 బంతుల్లో) కనీసం ఒక్క బౌండరీ కూడా కొట్టలేకపోవడంతో 120 పరుగులతోనే పంజాబ్ సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
ఏడో స్థానంలో క్రీజులోకి వచ్చిన షారూక్ ఖాన్ రెండు భారీ సిక్సర్లతో పంజాబ్ శిబిరంలో ఉత్సాహం నింపాడు. అయితే.. అతనికి ఫాబియన్ అలెన్ (6: 11 బంతుల్లో), మురగన్ అశ్విన్ (9: 10 బంతుల్లో 1x4) నుంచి ఆశించిన మేర సపోర్ట్ లభించలేదు. ఈ ఇద్దరూ కనీసం స్ట్రైక్ని కూడా రొటేట్ చేయలేకపోయారు. దాంతో.. బంతికో పరుగుని కూడా పంజాబ్ రాబట్టలేకపోయింది. దాంతో.. ఇన్నింగ్స్ 19వ ఓవర్లో గేర్ మార్చేందుకు ప్రయత్నించిన షారూక్ ఖాన్.. సిక్స్ కొట్టే ప్రయత్నంలో బౌండరీ లైన్ వద్ద ఫీల్డర్ అభిషేక్ శర్మ చేతికి చిక్కాడు. ఆఖర్లో మహ్మద్ షమీ (3: 3 బంతుల్లో), అర్షదీప్ సింగ్ (1 నాటౌట్: 2 బంతుల్లో) కనీసం ఒక్క బౌండరీ కూడా కొట్టలేకపోవడంతో 120 పరుగులతోనే పంజాబ్ సరిపెట్టుకోవాల్సి వచ్చింది.