ఐపీఎల్ 2022 సీజన్లో ఆడిన మొదటి మ్యాచ్లోనే ఓడిపోయిన సన్రైజర్స్ హైదరాబాద్కి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రాజస్థాన్ రాయల్స్తో మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్లో బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్లోనూ తేలిపోయిన హైదరాబాద్ టీమ్ 61 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. అయితే.. ఈ మ్యాచ్ ముగిసిన గంటల్లోనే ఆ జట్టుకి మ్యాచ్ రిఫరీ మరో షాకిచ్చాడు. హైదరాబాద్ టీమ్ స్లో ఓవర్ రేట్ తప్పిదానికి పాల్పడటంతో.. కెప్టెన్ కేన్ విలియమ్సన్కి రూ.12 లక్షల జరిమానా పడింది. వాస్తవానికి ఈ స్లో ఓవర్ రేట్ తప్పిదానికి సాధారణంగా రెండో ఇన్నింగ్స్లో బౌలింగ్ చేసే టీమ్ పాల్పడుతూ ఉంటుంది. కానీ.. మంగళవారం రాత్రి మ్యాచ్లో ఫస్ట్ బౌలింగ్ చేసిన సన్రైజర్స్ హైదరాబాద్ టీమ్.. కేటాయించిన సమయంలోపు వేయాల్సిన ఓవర్ల కంటే ఒక ఓవర్ని తక్కువగా వేసింది. దానికి కారణం కూడా లేకపోలేదు. జట్టులోని భువనేశ్వర్ కుమార్ రెండు నోబాల్స్ విసరగా.. ఉమ్రాన్ మాలిక్, వాషింగ్టన్ సుందర్ చెరొక నోబాల్ విసిరారు.
భువీ నోబాల్ కారణంగా.. జోస్ బట్లర్ (35)కి జీవనదానం లభించగా.. యశస్వి జైశ్వాల్కి కూడా ఒక లైఫ్ వచ్చింది. దాంతో.. ఇద్దరూ చెలరేగిపోయారు. ఆ తర్వాత వచ్చిన సంజు శాంసన్ (55: 27 బంతుల్లో 3x4, 5x6) భారీ సిక్సర్లు కొట్టడం.. ఆఖర్లో సిమ్రాన్ హెట్మెయర్ (32: 13 బంతుల్లో 2x4, 3x6) దూకుడుగా ఆడటంతో.. బౌలర్లు ఒత్తిడిలో పడిపోయారు. దాంతో.. వారికి సలహాలు, సూచనలు చేసేందుకు కేన్ విలియమ్సన్ ఎక్కువ సమయం కేటాయించాడు. ఈ నేపథ్యంలో.. మ్యాచ్ సమయం వృథా అయిపోయింది. టోర్నీలో ఇది హైదరాబాద్ టీమ్ తొలి తప్పిదం కావడంతో రూ.12 లక్షల జరిమానా పడింది. రిపీట్ అయితే.. ఆ జరిమానా రెట్టింపుకానుంది.
భువీ నోబాల్ కారణంగా.. జోస్ బట్లర్ (35)కి జీవనదానం లభించగా.. యశస్వి జైశ్వాల్కి కూడా ఒక లైఫ్ వచ్చింది. దాంతో.. ఇద్దరూ చెలరేగిపోయారు. ఆ తర్వాత వచ్చిన సంజు శాంసన్ (55: 27 బంతుల్లో 3x4, 5x6) భారీ సిక్సర్లు కొట్టడం.. ఆఖర్లో సిమ్రాన్ హెట్మెయర్ (32: 13 బంతుల్లో 2x4, 3x6) దూకుడుగా ఆడటంతో.. బౌలర్లు ఒత్తిడిలో పడిపోయారు. దాంతో.. వారికి సలహాలు, సూచనలు చేసేందుకు కేన్ విలియమ్సన్ ఎక్కువ సమయం కేటాయించాడు. ఈ నేపథ్యంలో.. మ్యాచ్ సమయం వృథా అయిపోయింది. టోర్నీలో ఇది హైదరాబాద్ టీమ్ తొలి తప్పిదం కావడంతో రూ.12 లక్షల జరిమానా పడింది. రిపీట్ అయితే.. ఆ జరిమానా రెట్టింపుకానుంది.