ఐపీఎల్ 2019 సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ మళ్లీ గెలుపు బాట పట్టింది. ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్పై బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్లో సమష్టిగా రాణించిన హైదరాబాద్ జట్టు 45 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. ఉప్పల్ వేదికగా సోమవారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్లో తొలుత ఓపెనర్ డేవిడ్ వార్నర్ (81: 56 బంతుల్లో 7x4, 2x6) అర్ధశతకం బాదడంతో 6 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసిన హైదరాబాద్ జట్టు.. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన పంజాబ్ని బౌలర్లు రషీద్ ఖాన్ (3/21), ఖలీల్ అహ్మద్ (3/40), సందీప్ శర్మ (2/33) చెలరేగడంతో 167/8కే పరిమితం చేసింది. ప్రపంచకప్ నేపథ్యంలో.. స్వదేశానికి వెళ్లిపోతున్న వార్నర్కి ఐపీఎల్లో ఇదే చివరి మ్యాచ్కాగా.. గెలిపించే ఇన్నింగ్స్ ఆడిన అతనికి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. undefinedundefined
పంజాబ్ జట్టులో ఓపెనర్ కేఎల్ రాహుల్ (79: 59 బంతుల్లో 4x4, 5x6) అసాధారణ ఇన్నింగ్స్ ఆడినా.. టాప్ ఆర్డర్ నుంచి కనీస సహకారం కూడా లభించకపోవడంతో పంజాబ్ని గెలిపించలేకపోయాడు. క్రిస్గేల్ (4) ఆరంభంలోనే ఔటవగా.. మయాంక్ అగర్వాల్ (27), నికోలస్ పూరన్ (21), డేవిడ్ మిల్లర్ (11), రవిచంద్రన్ అశ్విన్ (0) కీలక సమయంలో వరుసగా వికెట్లు చేజార్చుకున్నారు. తాజా సీజన్లో 12 మ్యాచ్లాడి ఆరో విజయాన్ని అందుకున్న హైదరాబాద్ 12 పాయింట్లతో ప్లేఆఫ్ ఆశల్ని సజీవంగా ఉంచుకోగా.. ఏడో పరాజయాన్ని చవిచూసిన పంజాబ్ 10 పాయింట్లతో సంక్లిష్టంగా మార్చుకుంది. ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ 16 పాయింట్లతో ప్లేఆఫ్ చేరిన విషయం తెలిసిందే.
మ్యాచ్లో టాస్ గెలిచిన పంజాబ్ కెప్టెన్ అశ్విన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో.. ఓపెనర్గా వచ్చిన వృద్ధిమాన్ సాహా (28: 13 బంతుల్లో 3x4, 1x6)తో కలిసి తొలి వికెట్కి 78 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన వార్నర్.. ఆ తర్వాత మనీశ్ పాండే (36: 25 బంతుల్లో 3x4, 1x6)తో కలిసి రెండో వికెట్కి 82 పరుగుల భాగస్వామ్యంతో హైదరాబాద్కి భారీ స్కోరు అందించాడు.
అర్ధశతకం తర్వాత జట్టు స్కోరు 163 వద్ద వార్నర్ ఔటవగా.. ఆ తర్వాత వచ్చిన మహ్మద్ నబీ (20: 10 బంతుల్లో 2x6), కేన్ విలియమ్సన్ (14: 7 బంతుల్లో 1x4, 1x6) దూకుడుగా ఆడే ప్రయత్నంలో ఔటయ్యారు. కానీ.. ఆఖర్లో విజయ్ శంకర్ (7 నాటౌట్), అభిషేక్ శర్మ (5 నాటౌట్) విలువైన పరుగులు చేశారు. పంజాబ్ బౌలర్లలో అశ్విన్, మహ్మద్ షమీ చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. మురగన్ అశ్విన్, అర్షదీప్ సింగ్ తలో వికెట్ పడగొట్టారు.
సన్రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు: డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), మనీశ్ పాండే, విజయ్ శంకర్, మహ్మద్ నబీ, వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, సందీప్ శర్మ, ఖలీల్ అహ్మద్
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తుది జట్టు: కేఎల్ రాహుల్, క్రిస్గేల్, మయాంక్ అగర్వాల్, డేవిడ్ మిల్లర్, నికోలస్ పూరన్ (వికెట్ కీపర్), సిమ్రాన్ సింగ్, రవిచంద్రన్ అశ్విన్ (కెప్టెన్), మురగన్ అశ్విన్, అంకిత్ రాజ్పుత్, మహ్మద్ షమీ, ముజీబ్ ఉర్ రెహ్మాన్
Sunrisers Hyderabad Playing XI
David Warner, Kane Williamson (c), Manish Pandey, Vijay Shankar, Mohammad Nabi, Wriddhiman Saha (wk), Abhishek Sharma, Rashid Khan, Bhuvneshwar Kumar, Sandeep Sharma, K Khaleel Ahmed
Kings XI Punjab Playing XI
Lokesh Rahul, Chris Gayle, Mayank Agarwal, David Miller, Nicholas Pooran (wk), Simran Singh, Ravichandran Ashwin (c), Murugan Ashwin, Ankit Rajpoot, Mohammed Shami, Mujeeb Ur Rahman
పంజాబ్ జట్టులో ఓపెనర్ కేఎల్ రాహుల్ (79: 59 బంతుల్లో 4x4, 5x6) అసాధారణ ఇన్నింగ్స్ ఆడినా.. టాప్ ఆర్డర్ నుంచి కనీస సహకారం కూడా లభించకపోవడంతో పంజాబ్ని గెలిపించలేకపోయాడు. క్రిస్గేల్ (4) ఆరంభంలోనే ఔటవగా.. మయాంక్ అగర్వాల్ (27), నికోలస్ పూరన్ (21), డేవిడ్ మిల్లర్ (11), రవిచంద్రన్ అశ్విన్ (0) కీలక సమయంలో వరుసగా వికెట్లు చేజార్చుకున్నారు. తాజా సీజన్లో 12 మ్యాచ్లాడి ఆరో విజయాన్ని అందుకున్న హైదరాబాద్ 12 పాయింట్లతో ప్లేఆఫ్ ఆశల్ని సజీవంగా ఉంచుకోగా.. ఏడో పరాజయాన్ని చవిచూసిన పంజాబ్ 10 పాయింట్లతో సంక్లిష్టంగా మార్చుకుంది. ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ 16 పాయింట్లతో ప్లేఆఫ్ చేరిన విషయం తెలిసిందే.
మ్యాచ్లో టాస్ గెలిచిన పంజాబ్ కెప్టెన్ అశ్విన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో.. ఓపెనర్గా వచ్చిన వృద్ధిమాన్ సాహా (28: 13 బంతుల్లో 3x4, 1x6)తో కలిసి తొలి వికెట్కి 78 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన వార్నర్.. ఆ తర్వాత మనీశ్ పాండే (36: 25 బంతుల్లో 3x4, 1x6)తో కలిసి రెండో వికెట్కి 82 పరుగుల భాగస్వామ్యంతో హైదరాబాద్కి భారీ స్కోరు అందించాడు.
అర్ధశతకం తర్వాత జట్టు స్కోరు 163 వద్ద వార్నర్ ఔటవగా.. ఆ తర్వాత వచ్చిన మహ్మద్ నబీ (20: 10 బంతుల్లో 2x6), కేన్ విలియమ్సన్ (14: 7 బంతుల్లో 1x4, 1x6) దూకుడుగా ఆడే ప్రయత్నంలో ఔటయ్యారు. కానీ.. ఆఖర్లో విజయ్ శంకర్ (7 నాటౌట్), అభిషేక్ శర్మ (5 నాటౌట్) విలువైన పరుగులు చేశారు. పంజాబ్ బౌలర్లలో అశ్విన్, మహ్మద్ షమీ చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. మురగన్ అశ్విన్, అర్షదీప్ సింగ్ తలో వికెట్ పడగొట్టారు.
సన్రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు: డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), మనీశ్ పాండే, విజయ్ శంకర్, మహ్మద్ నబీ, వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, సందీప్ శర్మ, ఖలీల్ అహ్మద్
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తుది జట్టు: కేఎల్ రాహుల్, క్రిస్గేల్, మయాంక్ అగర్వాల్, డేవిడ్ మిల్లర్, నికోలస్ పూరన్ (వికెట్ కీపర్), సిమ్రాన్ సింగ్, రవిచంద్రన్ అశ్విన్ (కెప్టెన్), మురగన్ అశ్విన్, అంకిత్ రాజ్పుత్, మహ్మద్ షమీ, ముజీబ్ ఉర్ రెహ్మాన్
Sunrisers Hyderabad Playing XI
David Warner, Kane Williamson (c), Manish Pandey, Vijay Shankar, Mohammad Nabi, Wriddhiman Saha (wk), Abhishek Sharma, Rashid Khan, Bhuvneshwar Kumar, Sandeep Sharma, K Khaleel Ahmed
Kings XI Punjab Playing XI
Lokesh Rahul, Chris Gayle, Mayank Agarwal, David Miller, Nicholas Pooran (wk), Simran Singh, Ravichandran Ashwin (c), Murugan Ashwin, Ankit Rajpoot, Mohammed Shami, Mujeeb Ur Rahman