కోల్కతా నైట్రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య బుధవారం రాత్రి జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచ్లో ఓ కామెడీ సన్నివేశం చోటు చేసుకుంది. ఇన్నింగ్స్ 17వ ఓవర్ వేసిన కోల్కతా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో భారీ షాట్ ఆడిన సిమ్రాన్ హెట్మెయర్.. లాంగాన్లో ఫీల్డర్ శుభమన్ గిల్ చేతికి చిక్కాడు. ముందుకు డైవ్ చేస్తూ గిల్ చక్కటి క్యాచ్ అందుకోగా.. హెట్మెయర్ నిరాశగా మైదానం వీడి ఢిల్లీ డగౌట్కి వెళ్లిపోయాడు. కానీ.. రెండు నిమిషాల వ్యవధిలో అతడ్ని మళ్లీ బ్యాటింగ్ కోసం ఫీల్డ్ అంపైర్ పిలిచాడు. దాంతో.. డగౌట్ నుంచి గంతులేసుకుంటూ హెట్మెయర్ క్రీజులోకి వచ్చాడు. అసలు ఏం జరిగిందంటే? హెట్మెయర్కి ఫుల్ లెంగ్త్ డెలివరీని విసిరే క్రమంలో వరుణ్ చక్రవర్తి క్రీజుకి కాస్త వెలుపలగా పాదం ఉంచి బంతిని విసిరాడు. మారిన ఐపీఎల్ నిబంధనల ప్రకారం.. ఔటైన బంతి లీగల్ డెలివరీయేనా? అని ఫీల్డ్ అంపైర్లు ఒకసారి చెక్ చేయడం తప్పనిసరిగా మారిపోయింది. అందులో భాగంగా వరుణ్ చక్రవర్తి డెలివరీని కూడా పరిశీలించగా.. క్రీజుపై పాదం ఉంచి అతను బౌలింగ్ చేసినట్లు కనిపిచింది. కానీ.. క్రీజు లోపల ఏమాత్రం షూ లేకపోవడంతో థర్డ్ అంపైర్తో చర్చలు జరిపిన ఫీల్డ్ అంపైర్ ఆఖరికి ఆ బంతిని నోబాల్గా ప్రకటించాడు. దాంతో.. ఢిల్లీ క్యాపిటల్స్కి ఫ్రీ హిట్ కూడా లభించింది.
వాస్తవానికి గతంలో క్రికెట్ నిబంధనల ప్రకారం.. ఔటైన బ్యాట్స్మెన్ మైదానం వెలుపలికి వెళ్లిపోతే ఆ తర్వాత మళ్లీ ఫీల్డ్ అంపైర్లు వెనక్కి పిలిచేవారు కాదు. కానీ.. ఇప్పుడు రూల్స్ని సవరించారు. దాంతో.. డగౌట్లోకి వెళ్లిపోయినా.. మళ్లీ హెట్మెయర్ని అంపైర్లు మైదానంలోకి పిలిచారు. దాంతో.. గంతులేసుకుంటూ క్రీజులోకి వచ్చిన హెట్మెయర్.. ఆ తర్వాత ఓవర్లో ఫెర్గూసన్కి రెండు సిక్సర్లు కొట్టాడు. కానీ.. ఇన్నింగ్స్ 19వ ఓవర్లో లేని పరుగు కోసం ప్రయత్నిస్తూ హెట్మెయర్ రనౌట్గా వెనుదిరిగాడు. ఈ మ్యాచ్లో ఆఖరికి 3 వికెట్ల తేడాతో గెలిచిన కోల్కతా ఫైనల్కి చేరగా.. ఢిల్లీ క్యాపిటల్స్ ఇంటికి వెళ్లింది.
వాస్తవానికి గతంలో క్రికెట్ నిబంధనల ప్రకారం.. ఔటైన బ్యాట్స్మెన్ మైదానం వెలుపలికి వెళ్లిపోతే ఆ తర్వాత మళ్లీ ఫీల్డ్ అంపైర్లు వెనక్కి పిలిచేవారు కాదు. కానీ.. ఇప్పుడు రూల్స్ని సవరించారు. దాంతో.. డగౌట్లోకి వెళ్లిపోయినా.. మళ్లీ హెట్మెయర్ని అంపైర్లు మైదానంలోకి పిలిచారు. దాంతో.. గంతులేసుకుంటూ క్రీజులోకి వచ్చిన హెట్మెయర్.. ఆ తర్వాత ఓవర్లో ఫెర్గూసన్కి రెండు సిక్సర్లు కొట్టాడు. కానీ.. ఇన్నింగ్స్ 19వ ఓవర్లో లేని పరుగు కోసం ప్రయత్నిస్తూ హెట్మెయర్ రనౌట్గా వెనుదిరిగాడు. ఈ మ్యాచ్లో ఆఖరికి 3 వికెట్ల తేడాతో గెలిచిన కోల్కతా ఫైనల్కి చేరగా.. ఢిల్లీ క్యాపిటల్స్ ఇంటికి వెళ్లింది.