యాప్నగరం

సిరాజ్ ఇంట్లో హైదరాబాద్ బిర్యానీ రుచి చూసిన కోహ్లి

సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌కు ముందు ఆర్‌సీబీ ఆటగాళ్లు క్రికెటర్ సిరాజ్ ఇంట్లో సందడి చేశారు. కెప్టెన్ విరాట్ కోహ్లితోపాటు పార్థీవ్ పటేల్, మన్‌దీప్ సింగ్‌లు సిరాజ్ ఇంట్లో బిర్యానీ రుచి చూశారు

Samayam Telugu 7 May 2018, 3:44 pm

సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌కు ముందు ఆర్‌సీబీ ఆటగాళ్లు క్రికెటర్ సిరాజ్ ఇంట్లో సందడి చేశారు. కెప్టెన్ విరాట్ కోహ్లితోపాటు పార్థీవ్ పటేల్, మన్‌దీప్ సింగ్‌లు సిరాజ్ ఇంట్లో బిర్యానీ రుచి చూశారు. ఆదివారం రాత్రి సిరాజ్ ఇంటికెళ్లిన వీరు అక్కడ కాసేపు సరదాగా గడిపారు. పక్కా హైదరాబాదీ స్టయిల్లో కూర్చొని సిరాజ్ కుటుంబీకుల ఆతిథ్యం స్వీకరించారు.
Samayam Telugu kohli siraj


హైదరాబాద్ క్రికెటర్ అయిన సిరాజ్ గతేడాది సన్‌రైజర్స్ తరఫున ఆడగా.. ఈ ఏడాది బెంగళూరు తరఫున బరిలో దిగుతున్నాడు. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న సన్‌రైజర్స్‌తో కోహ్లిసేన సోమవారం రాత్రి కీలక మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌లో గెలవడం ద్వారా ప్లేఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలని ఆర్‌సీబీ భావిస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.