యాప్నగరం

హైదరాబాద్‌కి 20 పరుగులు అదనంగా ఇచ్చాం..!

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకి తాము ఊహించిన దానికంటే అదనంగా 20 పరుగులు ఎక్కువగా ఇచ్చామని.. అదే మ్యాచ్‌ను రాయల్ ఛాలెంజర్స్

Samayam Telugu 8 May 2018, 5:44 pm
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకి తాము ఊహించిన దానికంటే అదనంగా 20 పరుగులు ఎక్కువగా ఇచ్చామని.. అదే మ్యాచ్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకి దూరం చేసిందని ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ అభిప్రాయపడ్డాడు. గత ఏడాది హైదరాబాద్ జట్టుకి ఆడిన సిరాజ్ ఈ ఏడాది ఐపీఎల్ వేలంలో బెంగళూరు జట్టుకి మారిన విషయం తెలిసిందే. సోమవారం రాత్రి ఉప్పల్ వేదికగా హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో మొత్తం 4 ఓవర్లు వేసిన ఈ ఫాస్ట్ బౌలర్ 25 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. దీంతో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు 146 పరుగులకి ఆలౌటవగా.. ఛేదనలో తడబడిన బెంగళూరు ఆఖరికి 141/6కే పరిమితమైంది.
Samayam Telugu ..


‘హైదరాబాద్‌తో మ్యాచ్‌ మేము తప్పక గెలవాల్సింది. కానీ.. మేము ఓడిపోయాం. మ్యాచ్‌లో సాధ్యమైనంత వరకూ తక్కువ పరుగులివ్వాలని బౌలింగ్ చేశాను. కానీ.. ఆఖరికి బెంగళూరు జట్టు 20 పరుగుల్ని అదనంగా హైదరాబాద్‌కి ఇచ్చింది. ఈ తేడానే బెంగళూరు జట్టుకి చివర్లో మ్యాచ్‌ను చేజార్చింది. జట్టుకి గెలుపు ఓటములు స్వరసాధారణం.. కనీసం టోర్నీలో మిగిలిన మ్యాచ్‌ల్లోనైనా మెరుగైన ప్రదర్శన చేస్తాం’ అని మహ్మద్ సిరాజ్ వెల్లడించాడు. టోర్నీలో ఇప్పటి వరకు 10 మ్యాచ్‌లాడిన బెంగళూరు జట్టు ఏకంగా ఏడింట్లో ఓడిపోగా.. మిగిలిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ గెలిచినా ప్లేఆఫ్ చేరడం కష్టంగానే కనిపిస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.