యాప్నగరం

రాజస్థాన్‌కు ఊతప్ప.. భారీ ధరకు కొనుగోలు

రాబిన్ ఊతప్పకు ఈసారి వేలంలో భారీ ధర పలికింది. రూ.3 కోట్లకు తనను రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేసింది.

Samayam Telugu 19 Dec 2019, 3:58 pm
ఐపీఎల్‌ వేలంలో భారత ప్లేయర్ రాబిన్ ఉతప్ప జాక్‌పాట్ కొట్టాడు. గురువారం కోల్‌కతాలో నిర్వహించిన వేలంలో ఊతప్పను రాజస్థాన్ రాయల్స్ రూ.3 కోట్లకు కొనుగోలు చేసింది. వెటరన్ స్పెషలిస్టు ఓపెనర్ అయిన ఊతప్పను కొనుగోలు చేయడానికి ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి.
Samayam Telugu UTHAPPA


నిజానికి ఈసారి వేలంలో తను కనీసధరను రూ.1.50 కోట్లకు ఊతప్ప నిర్దేశించుకున్నాడు. అయితే వేలంలో తన పేరు వచ్చిన కాసేపటికే ఫ్రాంచైజీలు తన కోసం పోటీపడ్డాయి. మెల్లిగా తన ధర అమాంత పెరుగుతూ పోయింది. చివరకు రాజస్థాన్ రాయల్స్ తనను రూ.3 కోట్లకు కొనుగోలు చేసింది.

మరోవైపు ఈసారి వేలంలో తెలుగు ప్లేయర్ హనుమ విహారి, టెస్టు స్పెషలిస్టు చటేశ్వర్ పుజారాలకు నిరాశ తప్పలేదు. గతేడాది ఢిల్లీ క్యాపిటల్స్ విహారిని కొనుగోలు చేయగా.. ఈసారి తనకు నిరాశే ఎదురైంది. మరోవైపు పుజారాను కూడా ఈసారి వేలంలో ఎవరూ తీసుకోలేదు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.