యాప్నగరం

కుర్రాళ్లతో గల్లీ క్రికెట్ ఆడిన సచిన్..!

భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ముంబయిలోని కుర్రాళ్లతో గల్లీ క్రికెట్ ఆడి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ప్రస్తుతం జరుగుతున్న

Samayam Telugu 17 Apr 2018, 12:54 pm
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ముంబయిలోని కుర్రాళ్లతో గల్లీ క్రికెట్ ఆడి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్ జట్టుకి తన సహాయ సహకారాలు అందిస్తున్న సచిన్.. వాంఖడే వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లకి తప్పకుండా వస్తున్నాడు. టోర్నీలో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో వాంఖడే వేదికగా మంగళవారం రాత్రి 8 గంటలకి ముంబయి ఇండియన్స్ జట్టు మ్యాచ్ ఆడనుంది.
Samayam Telugu ..


24 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో మొత్తం వన్డే, టెస్టుల్లో కలిపి 100 శతకాలు బాదిన సచిన్ టెండూల్కర్ 2013‌లో ఆటకి వీడ్కోలు చెప్పిన విషయం తెలిసిందే. ఐపీఎల్‌లోనూ ముంబయి ఇండియన్స్‌ తరఫున సచిన్ టెండూల్కర్ 78 మ్యాచ్‌లు ఆడి 2,334 పరుగులు చేశాడు. ఇందులో ఒక శతకంతో పాటు 13 అర్ధశతకాలు ఉండటం విశేషం. గత మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ చేతిలో అనూహ్యంగా ఓడిన ముంబయి ఇండియన్స్ జట్టు.. టోర్నీలో హ్యాట్రిక్ ఓటములతో ఢీలా పడింది. దీంతో.. ఈరోజు సొంతగడ్డపై విజయంతో బోణి కొట్టాలని ఆ జట్టు ఆశిస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.