యాప్నగరం

​ 115 పరుగుల భాగస్వామ్యానికి తెర..!

శ్రీలంకతో మొహాలి వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో భారత్ జట్టు తొలి వికెట్ కోల్పోయింది. ఇన్నింగ్స్‌ 22వ ఓవర్ వేసిన

TNN 13 Dec 2017, 1:20 pm
శ్రీలంకతో మొహాలి వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో భారత్ జట్టు తొలి వికెట్ కోల్పోయింది. ఇన్నింగ్స్‌ 22వ ఓవర్ వేసిన స్పిన్నర్ పతిరన బౌలింగ్‌లో ఓపెనర్ శిఖర్ ధావన్ (68: 67 బంతుల్లో 9x4) బంతిని స్వీప్‌ చేయబోయి ఫీల్డర్ తిరుమానెకి చిక్కాడు. దీంతో 115 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. ప్రస్తుతం క్రీజులో కెప్టెన్ రోహిత్ శర్మ, శ్రేయాస్ అయ్యర్ ఉన్నారు.
Samayam Telugu 2nd odi at mohali dhawan falls for 68
​ 115 పరుగుల భాగస్వామ్యానికి తెర..!


లెగ్‌ వికెట్‌‌ని లక్ష్యంగా చేసుకుని పతిరన బంతిని విసరగా.. పాదం కదలికతో ధావన్ బంతిని షార్ట్ మిడ్‌ వికెట్‌ దిశగా బౌండరీకి తరలించేందుకు ప్రయత్నించాడు. కానీ.. తన పక్క నుంచి వెళ్తున్న బంతిని అద్భుత రీతిలో డైవ్ చేస్తూ తిరుమానె క్యాచ్‌గా అందుకుని అందర్నీ ఆశ్చర్యపరిచాడు. తొలి వన్డేలో శిఖర్ ధావన్ డకౌటైన విషయం తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.