యాప్నగరం

Team India | అహ్మదాబాద్ టెస్టు ముంగిట టీమిండియాని ఊరిస్తున్న మూడు రికార్డులు

India vs Australia 4th Test టెస్టు ముంగిట టీమిండియాని మూడు రికార్డులు ఊరిస్తున్నాయి. అహ్మదాబాద్ టెస్టులో భారత్ గెలిస్తే? ఐసీసీ టీమ్ ర్యాంకింగ్స్‌లో అన్ని ఫార్మాట్లలోనూ టాప్ ప్లేస్‌లోకి వెళ్లనుంది. అలానే..?

Authored byరాజేంద్ర గాలేటి | Samayam Telugu 8 Mar 2023, 8:15 pm

ప్రధానాంశాలు:

  • భారత్, ఆస్ట్రేలియా మధ్య గురువారం నుంచి నాలుగో టెస్టు
  • ఈ మ్యాచ్‌లో గెలిస్తే టీమిండియా ఖాతాలో మూడు రికార్డులు
  • ఇప్పటికే సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలో భారత్
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu India vs Australia 4th Test
India vs Australia : ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టు ముంగిట భారత్ జట్టుని మూడు అరుదైన రికార్డులు ఊరిస్తున్నాయి. బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరుగుతున్న ఈ నాలుగు టెస్టుల సిరీస్‌లో టీమిండియా ప్రస్తుతం 2-1తో ఆధిక్యంలో కొనసాగుతోంది. అయితే.. ఇండోర్ వేదికగా గత వారం ముగిసిన మూడో టెస్టులో అటు బ్యాటింగ్.. ఇటు బౌలింగ్‌లో నిరాశపరిచిన భారత్ జట్టుకి 9 వికెట్ల తేడాతో పరాజయం ఎదురైంది. ఈ నేపథ్యంలో అహ్మదాబాద్ వేదికగా గురువారం నుంచి ప్రారంభంకానున్న నాలుగో టెస్టులో ఒకింత ఒత్తిడితోనే భారత్ జట్టు బరిలోకి దిగనుంది.
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా గురువారం ఉదయం 9 గంటలకి మ్యాచ్ ప్రారంభంకానుంది. ఈ టెస్టు మ్యాచ్‌లో భారత్ గెలిస్తే? ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ బెర్తు ఖరారుకానుంది. ప్రస్తుతం ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉన్న ఆస్ట్రేలియా ఇప్పటికే ఫైనల్‌కి చేరుకోగా.. మిగిలిన ఒక ఫైనల్ బెర్తు కోసం భారత్, శ్రీలంక పోటీలో ఉన్నాయి. భారత్ జట్టు ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా ఫైనల్‌కి చేరాలంటే అహ్మదాబాద్ టెస్టులో గెలవాలి. ఒకవేళ ఓడిపోతే? శ్రీలంక, న్యూజిలాండ్ మధ్య ఈ నెలలో జరిగే రెండు టెస్టు సిరీస్‌లో శ్రీలంక ఓడిపోవడంపై భారత్ ఫైనల్ అవకాశాలు ఆధారపడి ఉంటాయి.

అహ్మదాబాద్ టెస్టులో టీమిండియా విజయం సాధిస్తే? ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి వరుసగా రెండోసారి చేరిన తొలి జట్టుగా రికార్డు సొంతంకానుంది. అలానే ఐసీసీ టీమ్ ర్యాంకింగ్స్‌లో అన్ని ఫార్మాట్లలోనూ నెం.1 జట్టుగా టీమిండియా నిలవనుంది. ఐసీసీ వన్డే, టీ20 టీమ్ ర్యాంకింగ్స్‌లో భారత్ ప్రస్తుతం టాప్‌లో ఉంది. టెస్టుల్లో మాత్రం రెండో స్థానంలో ఉండగా.. టాప్‌లో ఆస్ట్రేలియా ఉంది. ఇక చివరిగా జరిగిన మూడు బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీల్లోనూ విజేతగా నిలిచిన భారత్ జట్టు.. అహ్మదాబాద్ టెస్టులో గెలిస్తే? వరుసగా నాలుగు సార్లు ఈ ట్రోఫీగా గెలిచిన జట్టుగా రికార్డుల్లో నిలవనుంది.

Read Latest Sports News, Cricket News, Telugu News
రచయిత గురించి
రాజేంద్ర గాలేటి
గాలేటి రాజేంద్ర సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ స్పోర్ట్స్, సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాస్తుంటారు. క్రికెట్ అంటే అమితమైన ఇష్టం. మ్యాచ్‌లకి సంబంధించి ఆసక్తికరమైన కథనాల్ని అందిస్తుంటారు. ఈయనకి జర్నలిజంలో 10 ఏళ్లకి పైగా అనుభవం ఉంది. గతంలో ఈనాడు.నెట్‌లో పనిచేశారు. అంతకముందు జర్నలిజంలో పీజీ చేయడంతో పాటు ఈనాడు జర్నలిజం స్కూల్‌లో శిక్షణ పొందారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.