ఆడమ్ గిల్క్రిస్ట్, మహేంద్రసింగ్ ధోనీ.. క్రికెట్ ప్రపంచంలో వికెట్ కీపర్ల దృక్పథాన్ని మార్చేసిన ఆటగాళ్లు. ఆస్ట్రేలియా జట్టుకి సుదీర్ఘకాలం ఆడిన గిల్క్రిస్ట్.. ఓపెనర్/ వికెట్ కీపర్గా టీమ్లో చెరగని ముద్ర వేశాడు. మరోవైపు ధోనీ కూడా కీపర్/ఫినిషర్/ కెప్టెన్గా మూడు ఐసీసీ టోర్నీలను భారత్కి అందించాడు. మొత్తంగా ఇద్దరు క్రికెటర్లు.. ఎంతో మంది యువ వికెట్ కీపర్లకి స్ఫూర్తిప్రదాతలుగా నిలిచారు. మరి ఈ ఇద్దరిలో ఎవరు బెస్ట్ అంటే..? ఇదే ప్రశ్న పాకిస్థాన్ మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్కి ఎదురైంది.
పాకిస్థాన్ జట్టుకి గత ఏడాది చివరి నుంచి దూరంగా ఉంటున్న సర్ఫరాజ్ అహ్మద్ తాజాగా ఓ లైవ్ సెషన్లో మాట్లాడుతుండగా.. అతనికి ‘ధోనీ లేదా గిల్క్రిస్ట్.. ఈ ఇద్దరిలో ఎవరు బెస్ట్..?’ అనే ప్రశ్న ఎదురైంది. దాంతో.. క్షణం కూడా ఆలోచించని సర్ఫరాజ్.. ‘ధోనీ’ అని సమాధానం చెప్పేశాడు. 2007లో అంతర్జాతీయ క్రికెట్లోకి సర్ఫరాజ్ అరంగేట్రం చేయగా.. 2008లో గిల్క్రిస్ట్ రిటైర్మెంట్ ప్రకటించాడు. దాంతో.. గిల్క్రిస్ట్ బ్యాటింగ్, కీపింగ్ ప్రదర్శనల్ని టీవీల్లో మాత్రమే సర్ఫరాజ్ చూసి ఉండొచ్చు. కానీ.. ధోనీ ఆట అతనికి సుపరిచితం. ఈ ఇద్దరూ ప్రత్యర్థులుగా చాలా మ్యాచ్ల్లో ఢీకొన్నారు.
కెప్టెన్గా, బ్యాట్స్మెన్గా గత ఏడాది చివర్లో సర్ఫరాజ్ అహ్మద్ ఘోరంగా విఫలమయ్యాడు. దాంతో.. అతడిని కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ).. వన్డే/ టీ20 పగ్గాలు బాబర్ అజామ్ చేతికి, టెస్టు టీమ్ కెప్టెన్సీని అజహర్ అలీకి అప్పగించింది. ఇక ఇంగ్లాండ్ టూర్కి త్వరలోనే పాకిస్థాన్ జట్టు వెళ్లనుండగా.. ఆ పర్యటన కోసం సర్ఫరాజ్ అహ్మద్ని కూడా ఎంపిక చేశారు.
పాకిస్థాన్ జట్టుకి గత ఏడాది చివరి నుంచి దూరంగా ఉంటున్న సర్ఫరాజ్ అహ్మద్ తాజాగా ఓ లైవ్ సెషన్లో మాట్లాడుతుండగా.. అతనికి ‘ధోనీ లేదా గిల్క్రిస్ట్.. ఈ ఇద్దరిలో ఎవరు బెస్ట్..?’ అనే ప్రశ్న ఎదురైంది. దాంతో.. క్షణం కూడా ఆలోచించని సర్ఫరాజ్.. ‘ధోనీ’ అని సమాధానం చెప్పేశాడు. 2007లో అంతర్జాతీయ క్రికెట్లోకి సర్ఫరాజ్ అరంగేట్రం చేయగా.. 2008లో గిల్క్రిస్ట్ రిటైర్మెంట్ ప్రకటించాడు. దాంతో.. గిల్క్రిస్ట్ బ్యాటింగ్, కీపింగ్ ప్రదర్శనల్ని టీవీల్లో మాత్రమే సర్ఫరాజ్ చూసి ఉండొచ్చు. కానీ.. ధోనీ ఆట అతనికి సుపరిచితం. ఈ ఇద్దరూ ప్రత్యర్థులుగా చాలా మ్యాచ్ల్లో ఢీకొన్నారు.
కెప్టెన్గా, బ్యాట్స్మెన్గా గత ఏడాది చివర్లో సర్ఫరాజ్ అహ్మద్ ఘోరంగా విఫలమయ్యాడు. దాంతో.. అతడిని కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ).. వన్డే/ టీ20 పగ్గాలు బాబర్ అజామ్ చేతికి, టెస్టు టీమ్ కెప్టెన్సీని అజహర్ అలీకి అప్పగించింది. ఇక ఇంగ్లాండ్ టూర్కి త్వరలోనే పాకిస్థాన్ జట్టు వెళ్లనుండగా.. ఆ పర్యటన కోసం సర్ఫరాజ్ అహ్మద్ని కూడా ఎంపిక చేశారు.