ఇటీవలే కెప్టెన్సీకి గుడ్బై చెప్పిన మహేంద్ర సింగ్ ధోనీ తొమ్మిదేళ్ల తర్వాత ఓ సాధారణ ఆటగాడిగా టీమిండియా తరఫున ఆడుతున్నాడు. చివరిసారిగా 2007 సెప్టెంబర్ 8న లార్డ్స్లో జరిగిన వన్డే మ్యాచ్లో ధోనీ జట్టు సభ్యుడిగా భారత్ తరఫున ఆడాడు. ఆ మ్యాచ్లో రాహుల్ ద్రవిడ్ కెప్టెన్గా వ్యవహరించాడు. 2004 డిసెంబర్ 23 వన్డల్లోకి అరంగ్రేటం చేసిన ధోనీ అనతి కాలంలోనే కెప్టెన్గా అవతరించాడు. తన నాయకత్వ పటిమతో జట్టుకు చిరకాల విజయాలు అందించాడు. ధోనీ 199 వన్డేలు, 72 టీ20లు సహా 60 టెస్టుల్లోనూ భారత జట్టుకు నాయకత్వం వహించాడు. మొత్తంగా 331 మ్యాచ్ల్లో కెప్టెన్గా వ్యవహరించాడు. మరే కెప్టెన్ కూడా ఇన్ని మ్యాచ్ల్లో కెప్టెన్గా వ్యవహరించలేదు.
పరిమిత ఓవర్ల కెప్టెన్గా జట్టు పగ్గాలు అందుకున్న తర్వాత కొద్ది విరామంలోనే పూర్తి స్థాయి కెప్టెన్సీ బాధ్యతలను ధోనీ అందుకున్నాడు. 2008 నవంబర్లో టెస్టు కెప్టెన్గా ఎంపికయ్యాక అన్ని ఫార్మాట్ల నాయకత్వ బాధ్యతలను ధోనీ భుజానికికెత్తున్నాడు. ధోనీపై కెప్టెన్సీ భారం లేకపోవడం వల్ల ఇక నుంచి తనదైన స్టయిల్లో హెలీకాఫ్టర్ షాట్లు ఆడాలని క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు. చాలా కాలం తర్వాత ధోనీ, యువీ జట్టు సభ్యులుగా పుణే వన్డేలో కలిసి ఆడుతున్నారు.
పుణే వన్డేలో ఆరు ఓవర్లు ముగిసే సమయానికి ఇంగ్లండ్ వికెట్ నష్టపోకుండా 34 పరుగులు చేసింది. జాసన్ రాయ్ 22 పరుగులతో, హేల్స్ 8 రన్స్తో క్రీజులో ఉన్నారు.
పరిమిత ఓవర్ల కెప్టెన్గా జట్టు పగ్గాలు అందుకున్న తర్వాత కొద్ది విరామంలోనే పూర్తి స్థాయి కెప్టెన్సీ బాధ్యతలను ధోనీ అందుకున్నాడు. 2008 నవంబర్లో టెస్టు కెప్టెన్గా ఎంపికయ్యాక అన్ని ఫార్మాట్ల నాయకత్వ బాధ్యతలను ధోనీ భుజానికికెత్తున్నాడు. ధోనీపై కెప్టెన్సీ భారం లేకపోవడం వల్ల ఇక నుంచి తనదైన స్టయిల్లో హెలీకాఫ్టర్ షాట్లు ఆడాలని క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు. చాలా కాలం తర్వాత ధోనీ, యువీ జట్టు సభ్యులుగా పుణే వన్డేలో కలిసి ఆడుతున్నారు.
పుణే వన్డేలో ఆరు ఓవర్లు ముగిసే సమయానికి ఇంగ్లండ్ వికెట్ నష్టపోకుండా 34 పరుగులు చేసింది. జాసన్ రాయ్ 22 పరుగులతో, హేల్స్ 8 రన్స్తో క్రీజులో ఉన్నారు.