పాకిస్థాన్తో జరుగుతున్న చివరి టెస్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా జట్టు 88 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 365 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (113), మ్యాథ్ రెన్షా (167 నాటౌట్) తొలి వికెట్కు 151 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ముఖ్యంగా వార్నర్ చెలరేగాడు. లంచ్ విరామ సమయంలోగా సెంచరీ బాదేశాడు. లంచ్ తర్వాత వార్నర్ను పెవిలియన్కు పంపిన రియాజ్.. ఉస్మాన్ ఖవాజాను కూడా అవుట్ చేశాడు. తర్వాత బ్యాటింగ్కు వచ్చిన స్మిత్ కూడా 24 పరుగుల వద్ద యాసిర్ షా బౌలింగ్లో వెనుదిరిగాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా.. మరో ఎండ్లో రెన్షా పాతుకుపోయాడు. కెరీర్లో తొలి సెంచరీ సాధించిన అతడు వంద పరుగుల మైలురాయి దాటాక గేరు మార్చాడు. పీటర్ హ్యాండ్స్కోంబ్(40 నాటౌట్)తో కలిసి నాలుగో వికెట్కు అభేద్యమైన 121 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.
ఈ మ్యాచ్లో సెంచరీ సాధించిన రెన్షా పాక్పై శతకం బాదిన రెండో పిన్నవయస్కుడైన ఓపెనర్ కావడం విశేషం. 1983లో భారత ఓపెనర్ రవిశాస్త్రి కరాచీలో పాక్పై సెంచరీ చేశాడు. అప్పుడు శాస్త్రి వయసు 20 ఏళ్ల 248 రోజులు కాగా, సిడ్నీలో మంగళవారం సెంచరీ సాధించిన రెన్షా వయసు 20 ఏళ్ల 281 రోజులు.
పిన్న వయసులో సెంచరీ సాధించిన మూడో ఆసీస్ ఓపెనర్ రెన్షా కావడం గమనార్హం. ఆర్చీ జాక్సన్, ఫిలిప్ హ్యుగ్స్లు రెన్షా కంటే చిన్నవయసులోనే సెంచరీలు సాధించారు.
సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో ఒకే ఇన్నింగ్స్లో ఆసీస్ ఓపెనర్లిద్దరూ సెంచరీలు చేయడం 2002 తర్వాత ఇదే తొలిసారి. 15 ఏళ్ల కిందట లాంగర్, హెడెన్ దక్షిణాఫ్రికాపై సెంచరీలు సాధించారు. ఓవరాల్గా సిడ్నీలో ఓపెనర్లిద్దరూ ఒకే ఇన్నింగ్స్లో శతకాలు చేయడం ఇది మూడోసారి మాత్రమే. 1986లో భారత ఓపెనింగ్ జోడి శ్రీకాంత్, గావస్కర్ శతకాలు బాదారు. సిడ్నీలో 17 టెస్టులు ఆడిన అలెన్ బోర్డర్, 10 టెస్టులు ఆడిన ఇయాన్ ఛాపెల్ ఒక్క సెంచరీ కూడా చేయలేకపోగా.. ఆ గ్రౌండ్లో ఆడిన తొలి మ్యాచ్లోనే రెన్షా సెంచరీ చేయడం విశేషం.
ఈ మ్యాచ్లో సెంచరీ సాధించిన రెన్షా పాక్పై శతకం బాదిన రెండో పిన్నవయస్కుడైన ఓపెనర్ కావడం విశేషం. 1983లో భారత ఓపెనర్ రవిశాస్త్రి కరాచీలో పాక్పై సెంచరీ చేశాడు. అప్పుడు శాస్త్రి వయసు 20 ఏళ్ల 248 రోజులు కాగా, సిడ్నీలో మంగళవారం సెంచరీ సాధించిన రెన్షా వయసు 20 ఏళ్ల 281 రోజులు.
పిన్న వయసులో సెంచరీ సాధించిన మూడో ఆసీస్ ఓపెనర్ రెన్షా కావడం గమనార్హం. ఆర్చీ జాక్సన్, ఫిలిప్ హ్యుగ్స్లు రెన్షా కంటే చిన్నవయసులోనే సెంచరీలు సాధించారు.
సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో ఒకే ఇన్నింగ్స్లో ఆసీస్ ఓపెనర్లిద్దరూ సెంచరీలు చేయడం 2002 తర్వాత ఇదే తొలిసారి. 15 ఏళ్ల కిందట లాంగర్, హెడెన్ దక్షిణాఫ్రికాపై సెంచరీలు సాధించారు. ఓవరాల్గా సిడ్నీలో ఓపెనర్లిద్దరూ ఒకే ఇన్నింగ్స్లో శతకాలు చేయడం ఇది మూడోసారి మాత్రమే. 1986లో భారత ఓపెనింగ్ జోడి శ్రీకాంత్, గావస్కర్ శతకాలు బాదారు. సిడ్నీలో 17 టెస్టులు ఆడిన అలెన్ బోర్డర్, 10 టెస్టులు ఆడిన ఇయాన్ ఛాపెల్ ఒక్క సెంచరీ కూడా చేయలేకపోగా.. ఆ గ్రౌండ్లో ఆడిన తొలి మ్యాచ్లోనే రెన్షా సెంచరీ చేయడం విశేషం.