యాప్నగరం

భారత స్పిన్నర్లతో మాకేమి ముప్పు లేదు..!

భారత మణికట్టు స్పిన్నర్లు చాహల్, కుల్దీప్ యాదవ్‌లను వన్డే సిరీస్‌లో ఎదుర్కోవడంపై దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ ఆందోళన

TNN 5 Feb 2018, 3:23 pm
భారత మణికట్టు స్పిన్నర్లు చాహల్, కుల్దీప్ యాదవ్‌లను వన్డే సిరీస్‌లో ఎదుర్కోవడంపై దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ ఆందోళన చెందడం లేదని ఆ జట్టు తాత్కాలిక కెప్టెన్ మార్‌క్రమ్ వెల్లడించాడు. సెంచూరియన్ వేదికగా ఆదివారం జరిగిన రెండో వన్డేలో ఈ ఇద్దరు స్పిన్నర్లే 8 వికెట్లు పడగొట్టి.. ఆ జట్టుని 118 పరుగులకి కుప్పకూల్చిన విషయం తెలిసిందే. స్పిన్నర్లని ఎదుర్కోవడంలో సఫారీ బ్యాట్స్‌మెన్ ఆందోళన చెందారని.. అందుకే క్రీజులో నిలవలేక పేలవంగా వికెట్లు సమర్పించుకున్నారంటూ విమర్శలు చెలరేగిన నేపథ్యంలో మార్‌క్రమ్ వివరణ ఇచ్చాడు.
Samayam Telugu aiden markram playing against spin not a massive danger for south africa
భారత స్పిన్నర్లతో మాకేమి ముప్పు లేదు..!


‘రెండో వన్డేలో దక్షిణాఫ్రికా టాప్ ఆర్డర్ మెరుగ్గా బ్యాటింగ్ చేయలేకపోయింది. ముఖ్యంగా స్పిన్నర్లని ఎదుర్కోవడం తడబడింది. అంతమాత్రానా.. చాహల్, కుల్దీప్ బౌలింగ్‌పై ఆందోళన చెందుతున్నామనడం సమంజసం కాదు. మేము పక్కా వ్యూహంతోనే బరిలోకి దిగాం. టాప్-6 బ్యాట్స్‌మెన్‌ తమ గేమ్‌ప్లాన్స్‌ గురించి మ్యాచ్‌కి ముందే నాతో చెప్పారు. కానీ.. మైదానంలో వాటిని అమలు చేయడంలో మాత్రం విఫలమయ్యారు. అవును.. మణికట్టు స్పిన్నర్లు చాలా బాగా బౌలింగ్ చేశారు. అయితే.. మేము కూడా తర్వాత వన్డేల్లో వారిని సమర్థంగా ఎదుర్కోనేందుకు నెట్స్‌లో ప్రత్యేకంగా ప్రాక్టీస్ చేస్తాం’ అని మార్‌క్రమ్ వెల్లడించాడు. మూడో వన్డే కేప్‌టౌన్ వేదికగా బుధవారం జరగనుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.