యాప్నగరం

ఫామ్‌ని చూడొద్దు.. రహానె బెస్ట్: గంగూలీ

దక్షిణాఫ్రికా పర్యటనలో మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ అజింక్య రహానె మెరుగ్గా రాణించగలడని భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ

TNN 18 Dec 2017, 7:31 pm
దక్షిణాఫ్రికా పర్యటనలో మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ అజింక్య రహానె మెరుగ్గా రాణించగలడని భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అభిప్రాయపడ్డారు. ఇటీవల శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్‌లో ఐదు ఇన్నింగ్స్‌ల్లో కలిపి రహానె చేసిన పరుగులు 17 మాత్రమే. దీంతో అతనిపై దక్షిణాఫ్రికా‌ పర్యటనలో వేటు పడనుందా..? అని సౌరవ్ గంగూలీని సోమవారం మీడియా ప్రశ్నించగా.. అతను సమాధానమిచ్చాడు. ఇటీవల భారత్ జట్టు ధర్మశాల వన్డేలో ఘోర పరాజయాన్ని చవిచూస్తే.. రహానెని మిగిలిన రెండు వన్డేల్లోనూ తుది జట్టులోకి తీసుకోవాల్సిందిగా టీమిండియా మేనేజ్‌మెంట్‌కి గంగూలీ సూచించిన విషయం తెలిసిందే. కానీ.. ఈ సూచనని మేనేజ్‌మెంట్ పక్కన పెట్టి యువ బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్‌ని కొనసాగించింది.
Samayam Telugu ajinkya rahanes form is not a matter of concern sourav ganguly
ఫామ్‌ని చూడొద్దు.. రహానె బెస్ట్: గంగూలీ


‘అజింక్య రహానె ఫామ్‌ గురించి ఆందోళన అవసరం లేదు. అతను క్వాలిటీ ప్లేయర్. విరాట్ కోహ్లి, రహానె, పుజారా, మురళీ విజయ్.. వీరంతా తప్పకుండా దక్షిణాఫ్రికా పర్యటనకి వెళ్లే జట్టులో ఉండాలి. ఎందుకంటే వారికి అక్కడ ఆడిన అనుభవం ఉంది. ఇంకా చెప్పాలంటే.. అత్యుత్తమ ఆటగాళ్లుగా మళ్లీ ఆ గడ్డపై అడుగుపెడుతున్నారు. ఇక బౌలింగ్ గురించి చెప్పాల్సి వస్తే..? మన టెస్టు బౌలర్ల సత్తాకి ఆ పర్యటన కచ్చితంగా కఠిన పరీక్ష. పేస్‌ వికెట్లపై ఉమేశ్, భువనేశ్వర్ ఎలా రాణిస్తారో చూడాలి. తుది జట్టు ఎంపికలో ప్లాట్ వికెట్ ఉంటే ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకి చోటివ్వాలి. అదనపు బ్యాట్స్‌మెన్ కావాలనుకుంటే.. ఫామ్‌లో ఉన్న రోహిత్‌ శర్మకి మిడిలార్డర్‌లో అవకాశం ఇస్తే బాగుంటుంది. ఓపెనర్లుగా మురళీ విజయ్, శిఖర్ ధావన్ భారత్ ఇన్నింగ్స్‌ని ఆరంభించాలి’ అని గంగూలీ వెల్లడించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.