యాప్నగరం

టీ20లో 9 పరుగులకే ఆలౌట్.. 9 డకౌట్స్

మధ్యప్రదేశ్ బౌలర్ల ధాటికి తొలి నలుగురు బ్యాటర్లు చేతులెత్తేయగా.. ఐదోస్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన అపూర్వ భరద్వాజ్ వికెట్ల పతనానికి అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేసింది. కానీ..?

Samayam Telugu 22 Feb 2019, 3:09 pm
టీ20 క్రికెట్‌లో పరుగుల వరదపారుతున్న తరుణంలో అనూహ్యంగా ఓ చెత్త ప్రదర్శన అభిమానుల దృష్టిని ఆకర్షించింది. పుదిచ్చేరి వేదికగా జరిగిన ఓ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన మిజోరాం మహిళల జట్టు.. పేలవంగా 9 పరుగులకే ఆలౌటైంది. ఆ జట్టులో ఏకంగా 9 మంది బ్యాటర్లు డకౌటవగా.. మిడిలార్డర్ బ్యాట్స్‌వుమెన్ అపూర్వ మాత్రం 6 పరుగులు చేసింది. మరో 3 పరుగులు ఎక్‌ట్రాల రూపంలో వచ్చాయి. దీంతో ఆ జట్టు స్కోరు బోర్డు ఇలా 0, 0, 0, 0, 6, 0, 0, 0, 0, 0, 0 (నాటౌట్‌) నిలిచింది. .అనంతరం లక్ష్య ఛేదనని మధ్యప్రదేశ్ జట్టు తొలి ఓవర్ (ఆరు బంతుల్లో)లోనే ఛేదించేసింది.
Samayam Telugu 55


మధ్యప్రదేశ్ బౌలర్ల ధాటికి తొలి నలుగురు బ్యాటర్లు చేతులెత్తేయగా.. ఐదోస్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన అపూర్వ భరద్వాజ్ వికెట్ల పతనానికి అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో 25 బంతులు ఎదుర్కొన్న అపూర్వ 13.5 ఓవర్ వరకూ క్రీజులో నిల్చొంది కానీ.. మరో ఎండ్‌లో మాత్రం వికెట్లను కాపాడుకోవడంలో మిజోరాం బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. దీంతో.. టీ20 క్రికెట్‌లో చెత్త రికార్డ్ నమోదైంది. ఇటీవల కేరళతో జరిగిన మ్యాచ్‌లోనూ విఫలమైన మిజోరాం.. 24 పరుగులకే ఆలౌటై 10 వికెట్ల తేడాతో పరాజయాన్ని మూటగట్టుకుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.