యాప్నగరం

టీమిండియాలోకి రాయుడు రీ ఎంట్రీ..

అప్పుడెప్పుడో ధోనీ నాయకత్వంలో భాారత జట్టులో చోటు దక్కించుకున్న రాయుడు.. ఐపీఎల్‌లో అద్భుత ప్రదర్శనతో తిరిగి టీమిండియాలో ఎంట్రీ ఇవ్వనున్నాడు.

Samayam Telugu 8 May 2018, 1:29 pm
ఐపీఎల్‌లో పరుగుల వరద పారిస్తోన్న తెలుగుతేజం అంబటి రాయుడు మళ్లీ టీమిండియా తలుపు తట్టనున్నాడా? అవుననే వార్తలు వెలువడుతున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ తరఫున తిరుగులేని ఆటతీరుతో ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్న రాయుడు ఇంగ్లాండ్, ఐర్లాండ్‌లతో జరగనున్న టీ20 సిరీస్‌లో ఆడే అవకాశం ఉందని సమాచారం. రాయుడి ఆటతీరును గమనిస్తున్నామని బీసీసీఐ ఇప్పటికే స్పష్టం చేసిన నేపథ్యంలో రాయుడికి పిలుపు అందడం ఖాయమే.
Samayam Telugu rayudu


ఇప్పటి వరకూ ఈ ఐపీఎల్ సీజన్లో పది ఇన్నింగ్స్ ఆడిన రాయుడు 42.3 సగటుతో 423 పరుగులు సాధించాడు. చెన్నై విజయాల్లో కీలకపాత్ర పోషిస్తోన్న రాయుడు 151.61 స్ట్రయిక్ రేట్‌తో పరుగులు రాబట్టడం విశేషం. రాయుడు చివరగా 2016లో జింబాబ్వే పర్యటనలో ధోనీ నాయకత్వంలో భారత్ తరఫున ఆడాడు.

ఐపీఎల్‌లో ఆకట్టుకునే ప్రదర్శన చేస్తోన్న కేఎల్ రాహుల్, ఉమేశ్ యాదవ్‌లకు కూడా తిరిగి భారత జట్టులో చోటు దక్కే అవకాశాలు ఉన్నాయి. ఇంగ్లాండ్‌‌లో పర్యటించే వన్డే జట్టులో వీరిద్దరికీ చోటు దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌లో పేలవ ప్రదర్శన చేసిన రాహుల్ అనంతరం జట్టులో చోటు కోల్పోయాడు. సౌతాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌‌లో అనూహ్యంగా ఉమేశ్ యాదవ్‌ను పక్కనబెట్టారు. కుల్దీప్ యాదవ్‌కు టెస్టు జట్టులోకి ఎంపిక చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.