యాప్నగరం

మళ్లీ శ్రీలంక కెప్టెన్‌గా మాధ్యూస్..?

శ్రీలంక పరిమిత ఓవర్ల జట్టుకి మళ్లీ కెప్టెన్‌గా ఏంజెలో మాథ్యూస్ బాధ్యతలు అందుకోబోతున్నాడు. ఆరు నెలల క్రితం

TNN 9 Jan 2018, 12:36 pm
శ్రీలంక పరిమిత ఓవర్ల జట్టుకి మళ్లీ కెప్టెన్‌గా ఏంజెలో మాథ్యూస్ బాధ్యతలు అందుకోబోతున్నాడు. ఆరు నెలల క్రితం జింబాబ్వేతో జరిగిన వన్డే సిరీస్‌లో శ్రీలంక జట్టు ఘోరంగా విఫలమడంతో ఆ దేశ క్రికెట్ బోర్డు మాథ్యూస్‌ని నాయకత్వ బాధ్యతల నుంచి తప్పించింది. తర్వాత.. ఉపుల్ తరంగ, లసిత్ మలింగ, కపుగెదర, తిసార పెరీరా ఇలా నలుగురు ఆటగాళ్లు ఆ జట్టు పరిమిత ఓవర్ల కెప్టెన్లుగా పనిచేశారు. కానీ.. ఈ మధ్యకాలంలో 29 వన్డేలాడిన శ్రీలంక జట్టు ఏకంగా 23 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. దీంతో 2019 ప్రపంచకప్‌ని దృష్టిలో ఉంచుకుని మళ్లీ మాథ్యూస్‌కే జట్టు పగ్గాలు అప్పగించాలని శ్రీలంక క్రికెట్ బోర్డు నిర్ణయించింది.
Samayam Telugu angelo mathews named sri lankas limited overs captain
మళ్లీ శ్రీలంక కెప్టెన్‌గా మాధ్యూస్..?


బోర్డు వ్యవహార శైలితో విసిగిపోయిన మాథ్యూస్ మళ్లీ కెప్టెన్సీ బాధ్యతలు అందుకునేందుకు మొదట అంగీకరించలేదట. అయితే.. జట్టు కొత్త కోచ్ చండికా అతడ్ని ఒప్పించడంతో చివరికి ఒప్పుకున్నట్లు తెలిసింది. ‘జట్టు పగ్గాలని అందుకునేందుకు ఏంజెలో మాథ్యూస్ సమ్మతించాడు. జట్టు కొత్త కోచ్ అతడ్ని ఒప్పించడంలో స‌ఫ‌లీకృత‌మ‌య్యాడు. సెలక్టర్లు కూడా మాథ్యూస్‌తో మాట్లాడి జట్టు తీరు గురించి సుదీర్ఘంగా చర్చించారు’ అని బోర్డు అధికారి ఒకరు తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.