యాప్నగరం

మైదానంలో గొడవపడిన పాక్ క్రికెటర్లు..!

పాకిస్థాన్‌కి చెందిన ఇద్దరు ప్రధాన క్రికెటర్లు మైదానంలోనే గొడవకి దిగారు. ఈ క్రమంలో సహనం కోల్పోయిన బౌలర్ సొహలీ ఖాన్

TNN 15 Mar 2018, 1:42 pm
పాకిస్థాన్‌కి చెందిన ఇద్దరు ప్రధాన క్రికెటర్లు మైదానంలోనే గొడవకి దిగారు. ఈ క్రమంలో సహనం కోల్పోయిన బౌలర్ సొహలీ ఖాన్ థర్డ్ మ్యాన్‌ ప్రదేశంలో ఫీల్డింగ్ చేస్తున్న యాసిర్ షాపై‌కి బంతిని కోపంగా విసిరేశాడు. భారత్‌లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ ( ఐపీఎల్‌) తరహాలో.. పాకిస్థాన్‌ కూడా దుబాయ్ వేదికగా పాకిస్థాన్ ప్రీమియర్ లీగ్ నిర్వహిస్తోంది. ఇందులో.. లాహోర్ జట్టుకి ప్రాతినిథ్యం వహించిన ఈ ఇద్దరు క్రికెటర్లు.. గొడవపడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాతో హల్‌చల్ చేస్తోంది.
Samayam Telugu angry bowler throws ball at teammate
మైదానంలో గొడవపడిన పాక్ క్రికెటర్లు..!


187 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన గ్లాడియేటర్స్ జట్టు.. విజయానికి చివరి 9 బంతుల్లో 30 పరుగులు చేయాల్సి వచ్చింది. ఈ దశలో ఇన్నింగ్స్ 19వ ఓవర్ బౌలింగ్ చేస్తున్న సొహలీ ఖాన్.. థర్డ్‌ మ్యాన్‌లో ఫీల్డింగ్ చేస్తున్న యాసిర్ షాను కొద్దిగా పక్కకి రావాలని సూచించాడు. అయితే.. స్టేడియంలో ప్రేక్షకుల హోరు మధ్య బౌలర్ మాటలు అర్థం కాకపోవడంతో యాసిర్ వేగంగా స్పందించలేకపోయాడు. దీంతో.. సహనం కోల్పోయిన సొహలీ ఖాన్.. బంతిని యాసిర్‌‌పైకి విసిరి అక్కడికి వెళ్లు.. అని సైగ చేశాడు. దీనికి యాసిర్ కూడా అదే రీతిలో కోపంగా బంతిని అతనిపైకి విసిరి బదులిచ్చాడు. చివరికి ఈ మ్యాచ్‌లో లాహోర్ జట్టు 17 పరుగుల తేడాతో గెలుపొందింది.
Sohail Khan decides if the fielder Yasir Shah won't stand where he wants him to he will just throw the ball at him #PSL2018 #LQvQG pic.twitter.com/8G6C4k5JH1 — Saj Sadiq (@Saj_PakPassion) March 14, 2018

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.