యాప్నగరం

ఇంగ్లాండ్‌లో స్పిన్నర్లే భారత్‌ని గెలిపిస్తారు..!

ఇంగ్లాండ్ గడ్డపై భారత స్పిన్నర్లు మెరుగ్గా రాణించి మ్యాచ్‌లను గెలిపిస్తారని దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే ధీమా వ్యక్తం చేశాడు. జూలై 3

Samayam Telugu 22 Jun 2018, 3:46 pm
ఇంగ్లాండ్ గడ్డపై భారత స్పిన్నర్లు మెరుగ్గా రాణించి మ్యాచ్‌లను గెలిపిస్తారని దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే ధీమా వ్యక్తం చేశాడు. జూలై 3 నుంచి ఆ గడ్డపై భారత జట్టు మూడు టీ20లు, మూడు వన్డేలతో పాటు ఐదు టెస్టుల సుదీర్ఘ సిరీస్ ఆడనుంది. ఈ నేపథ్యంలో.. అక్కడ మెరుగ్గా ఆడే బ్యాట్స్‌మెన్స్ ఎవరు..? అనే దానిపై చర్చ నడుస్తుండగా.. అనూహ్యంగా స్పిన్నర్లను అనిల్ కుంబ్లే తెరపైకి తీసుకొచ్చాడు. ఇంగ్లాండ్‌తో ఆడబోయే జట్టులో అశ్విన్, జడేజాతో పాటు కుల్దీప్ యాదవ్‌కి కూడా సెలక్టర్లు చోటిచ్చిన విషయం తెలిసిందే.
Samayam Telugu anil kumble believes india can spin and win it in england
ఇంగ్లాండ్‌లో స్పిన్నర్లే భారత్‌ని గెలిపిస్తారు..!


‘ఇంగ్లాండ్ పర్యటనలో భారత స్పిన్నర్లు కచ్చితంగా క్రియాశీలక పాత్ర పోషిస్తారు. సిరీస్‌ జరగనున్న జూలై- ఆగస్టు నెలల్లో అక్కడి పిచ్‌లు స్పిన్నర్లకి ఎక్కువగా అనుకూలిస్తాయి. మ్యాచ్ ఆరంభమైన కొద్దిసేపటికే స్పిన్నర్లు బౌలింగ్‌కి రావొచ్చు. భారత జట్టుకి టెస్టుల్లో 20 వికెట్లు పడగొట్టే సామర్థ్యం ఉంది. దీనికి తోడు.. కనీసం 50 టెస్టుల అనుభవం ఉన్న ఆటగాళ్లు ఎక్కువగా జట్టులో ఉన్నారు. గతంలో ఇంగ్లాండ్‌లో పర్యటించిన అనుభవం కూడా వారికి అక్కడ లాభించనుంది’ అని అనిల్ కుంబ్లే వెల్లడించాడు. ఈనెల 27, 29న ఐర్లాండ్‌తో రెండు టీ20ల సిరీస్ ఆడనున్న భారత్ ఆ తర్వాత ఇంగ్లాండ్‌కి వెళ్లనుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.