యాప్నగరం

బీసీసీఐ పరిశీలకుడిగా జీకే పిళ్లై: లోధా కమిటీ

తన సిఫార్సులతో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్న జస్టిస్ లోధా కమిటీ తాజాగా కొత్త సిఫార్సులను తీసుకొచ్చింది.

TNN 21 Nov 2016, 5:30 pm
తన సిఫార్సులతో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్న జస్టిస్ లోధా కమిటీ తాజాగా కొత్త సిఫార్సులను తీసుకొచ్చింది. బీసీసీఐ పరిశీలకుడిగా కేంద్ర హోం శాఖ మాజీ కార్యదర్శి జి.కె. పిళ్లైని నియమించాలని లోధా కమిటీ సుప్రీం కోర్టుకు నివేదించింది.
Samayam Telugu appoint ex home secretary gk pillai as bcci observer lodha panel to top court
బీసీసీఐ పరిశీలకుడిగా జీకే పిళ్లై: లోధా కమిటీ


బీసీసీఐ ఉన్నతాధికారులందరినీ తొలగించి, బోర్డు వ్యవహారాల అధికారాలన్నీ పిళ్లైకి కట్టబెట్టాలని లోధా కమిటీ సూచించింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) వంటి రాబోయే ప్రధాన టోర్నమెంట్ల మీడియా హక్కులు కోసం చేసుకునే బీసీసీఐ కాంట్రాక్టులను చూసుకోడానికి కీలక ఆడిటర్లను నియమిస్తారని, ఇకపై ఈ ప్రక్రియ అంతా పిళ్లై ఆధ్వర్యంలోనే జరగాలని సుప్రీం కోర్టుకు వెల్లడించింది.

బీసీసీఐలో ప్రక్షాళన కోసం సుప్రీం కోర్టు జస్టిస్ లోధా కమిటీని నియమించింది. ఈ కమిటీ ఇప్పటికే బీసీసీఐకి కొన్ని సిఫార్సులను సూచించింది. అయితే లోధా కమిటీ సూచించిన అన్ని సిఫార్సులను అమలు చేయడం అసాధ్యమని బీసీసీఐ గతంలో తేల్చి చెప్పింది. దీంతో ఆగ్రహించిన సుప్రీం కోర్టు ఈ ఏడాది డిసెంబర్ 3 నాటికి లోధా కమిటీ సిఫార్సులను అమలు చేయాలని బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్, 13 రాష్ట్రాల క్రికెట్ సంఘాలను ఆదేశించింది. అప్పటి వరకు బీసీసీఐ నుంచి రాష్ట్ర క్రికెట్ సంఘాలకు వెళ్లే నిధులను వెంటనే నిలిపివేయాలని ఆదేశించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.