యాప్నగరం

ఖేల్‌రత్న అవార్డుకి తెలుగు ఆర్చర్ జ్యోతి సురేఖ నామినేట్

విజయవాడకి చెందిన ఆర్చర్ జ్యోతి సురేఖ.. ప్రతిష్ఠాత్మక క్రీడా పురస్కారానికి నామినేట్ అయ్యింది. అంతర్జాతీయ స్థాయిలో ఇప్పటికే 9 బంగారు పతకాలు సాధించిన ఆమె పేరుని ఖేల్‌రత్న అవార్డుకి ఏపీ ప్రభుత్వం సిఫారసు చేసింది.

Samayam Telugu 3 Jun 2020, 7:10 am
ప్రతిష్ఠాత్మక క్రీడా పురస్కారం రాజీవ్‌ గాంధీ ఖేల్‌ రత్న అవార్డుకి తెలుగు ఆర్చర్ జ్యోతి సురేఖ నామినేట్ అయ్యింది. గత దశాబ్దకాలంగా ఇంటర్నేషనల్ లెవల్‌లో 33 పతకాలు సాధించిన సురేఖ పేరుని ఖేల్‌రత్న అవార్డు కోసం కేంద్ర క్రీడలు, యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా పంపింది. సురేఖతో పాటు యతిమరపు రజని (హాకీ) పేరుని అర్జున అవార్డు కోసం, భాస్కర్ బాబు (బ్యాడ్మింటన్) పేరుని ద్రోణాచార్య అవార్డు కోసం ఏపీ ప్రభుత్వం సిఫార్సు చేసింది.
Samayam Telugu archer Jyothi Surekha


ఆర్చరీలో సురేఖ సాధించిన 33 మెడల్స్‌లో 9 బంగారు, 13 రజతం, 11 కాంస్య పతకాలు ఉన్నాయి. ఇందులో ఏడు పతకాలు వరల్డ్‌‌కప్స్‌లో సాధించగా.. మూడు వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌లో, రెండేసి పతకాలు జూనియర్ వరల్డ్‌కప్, దక్షిణ ఆసియా గేమ్స్‌లో గెలిచినవి. ఇక గత కొంతకాలంగా భారత ఆర్చరీ టీమ్‌ని నెం.1 స్థానంలో నిలపడంలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న సురేఖకి.. 2017లోనే అర్జున అవార్డు వరించింది.

2019 వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌లో వ్యక్తిగతంగా పతకం గెలిచిన తొలి భారత మహిళా ఆర్చర్‌గా రికార్డు నెలకొల్పిన జ్యోతి సురేఖ.. ఇప్పుడు కెరీర్‌లోనే అత్యుత్తమ దశలో కొనసాగుతోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.