యాప్నగరం

శ్రీలంక మేనేజ్‌మెంట్ తీరుతోనే ఓటములు..!

జట్టు మేనేజ్‌మెంట్ తీరుతోనే శ్రీలంక ప్రదర్శన రోజురోజుకి తీసికట్టుగా మారుతోందని ఆ దేశ మాజీ కెప్టెన్

TNN 15 Aug 2017, 8:22 pm
జట్టు మేనేజ్‌మెంట్ తీరుతోనే శ్రీలంక ప్రదర్శన రోజురోజుకి తీసికట్టుగా మారుతోందని ఆ దేశ మాజీ కెప్టెన్ అర్జున్ రణతుంగ అభిప్రాయపడ్డాడు. సోమవారం ముగిసిన మూడు టెస్టుల సిరీస్‌లో శ్రీలంక 0-3 తేడాతో భారత్ చేతిలో ఓటమిపాలైంది. పల్లెకలెలో జరిగిన చివరి టెస్టు.. మరీ రెండున్నర రోజుల్లోనే ఆట ముగియడం, కనీసం ఒకరు కూడా చెప్పుకోదగ్గ స్కోరు చేయకపోవడంతో సర్వత్రా లంక జట్టుపై విమర్శలు చెలరేగాయి. అయితే.. ఓటములకి జట్టుని విమర్శించడం సరికాదని.. తప్పులంతా మేనేజ్‌మెంట్ చేస్తోందని రణతుంగ పెదవి విరిచాడు.
Samayam Telugu arjuna ranatunga blames management for sri lanka
శ్రీలంక మేనేజ్‌మెంట్ తీరుతోనే ఓటములు..!


‘శ్రీలంక జట్టు సంక్షోభం దిశగా వేగంగా వెళ్తోంది. ఇక్కడ ఆటగాళ్లని మాత్రమే నిందించలేం. వారు ఇప్పటికే నిరుత్సాహంలో ఉన్నారు. ఇక్కడ తప్పులన్నీ జట్టు మేనేజ్‌మెంట్ చేస్తోంది. ఆటగాళ్లలో క్రమశిక్షణ కోసం ప్రయత్నించకపోవడం.. జట్టు ఎంపికలో కఠిన నిర్ణయాలకి వెనుకంజ వేయడం లాంటివి శ్రీలంక ఓటములకి కారణం’ అని రణతుంగ వివరంచాడు. భారత్‌, శ్రీలంక మధ్య జరిగిన 2011 ప్రపంచకప్ ఫైనల్ ఫిక్స్ అయ్యిందంటూ ఇటీవల రణతుంగ సంచలన కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.