యాప్నగరం

భారత్ ప్రేక్షకుల్లా.. మీరూ చేస్తే ఎలా..?

​ భారత్‌తో జరిగిన మూడో వన్డేలో తమ జట్టు పేలవ ప్రదర్శనపై స్టేడియంలోనే నిరసన వ్యక్తం చేసిన శ్రీలంక అభిమానుల తీరుపై ఆ దేశ మాజీ

TNN 29 Aug 2017, 2:06 pm
భారత్‌తో జరిగిన మూడో వన్డేలో తమ జట్టు పేలవ ప్రదర్శనపై స్టేడియంలోనే నిరసన వ్యక్తం చేసిన శ్రీలంక అభిమానుల తీరుపై ఆ దేశ మాజీ క్రికెటర్ అర్జున్ రణతుంగ ఒకింత అసహనం వ్యక్తం చేశాడు. ఘనమైన క్రికెట్ చరిత్ర ఉన్న శ్రీలంక‌‌లో ప్రేక్షకులు ఇలా చేయడం తగదని.. భారత్‌ ప్రేక్షకుల్లా మ్యాచ్‌కి అంతరాయం కలిగించి దేశానికి చెడ్డపేరు తీసుకురావొద్దని సూచించాడు. 1996 ప్రపంచకప్ సెమీ ఫైనల్లో టీమిండియా ఓటమికి చేరువవుతుండటంతో ఈడెన్‌గార్డెన్స్‌లో భారత అభిమానులు పెద్ద ఎత్తున ఆందోళనకి దిగారు. స్టాండ్స్‌కి నిప్పుపెట్టి, వాటర్ బాటిల్స్‌లను మైదానంలోకి విసిరి మ్యాచ్‌కి అంతరాయం కలిగించారు. దీంతో మ్యాచ్‌ కొనసాగే అవకాశం లేకపోవడంతో ప్రత్యర్థి శ్రీలంకను అప్పట్లో విజేతగా ప్రకటించారు.
Samayam Telugu arjuna ranatunga urges sri lankan fans to not behave like indian spectators
భారత్ ప్రేక్షకుల్లా.. మీరూ చేస్తే ఎలా..?


‘స్టేడియంలో ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకూడదు. ఆటగాళ్లు క్రికెట్ కోసం చాలా త్యాగాలు చేస్తుంటారు. కాబట్టి.. ఒకవేళ మ్యాచ్ ఓడిపోతుంటే వారికి కూడా బాధే కదా..? ప్రస్తుతం జట్టులోని అందరు క్రికెటర్లు మానసికంగా చాలా దెబ్బతిన్నారు. నేను శ్రీలంక అభిమానులని కోరేది ఒక్కటే. దయచేసి.. భారత ప్రేక్షకుల్లా ప్రవర్తించకండి. శ్రీలంకకి ఘనమైన క్రికెట్ చరిత్ర ఉంది. అభిమానుల నుంచి ఇలాంటి చేష్టలను శ్రీలంక ఆమోదించదు’ అని రణతుంగ సూచించాడు. మూడో వన్డేలో భారత్ విజయానికి చేరువవగా.. మైదానంలోకి అభిమానులు వాటర్ బాటిల్స్ విసరడంతో దాదాపు అరగంట పాటు మ్యాచ్‌కి అంతరాయం ఏర్పడింది. నాలుగో వన్డే గురువారం జరగనుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.