యాప్నగరం

ప్రశాంతంగా ముగించడం ధోనీ నుంచే నేర్చుకున్నా..

దినేశ్ కార్తీక్ క్రీజులోకి అడుగు పెట్టే సమయానికి 12 బంతుల్లో 34 పరుగులు చేయాలి. మ్యాచ్ చేజారిందనే భావించారంతా.. కానీ ప్రశాంతంగా ఆడిన కార్తీక్.. చివరి బంతికి సిక్స్ బాది జట్టును గెలిపించాడు.

Samayam Telugu 19 Mar 2018, 12:42 pm
నిదహాస్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్లో దినేశ్ కార్తీక్ చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడాడు. 8 బంతుల్లోనే 29 పరుగులు చేసి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. 2006లో టీ20ల్లోకి అరంగేట్రం చేసిన కార్తీక్.. ఇప్పటి వరకూ కేవలం 19 మ్యాచ్ ల్లోనే బరిలో దిగాడు. భారత జట్టులో ధోనీ పాతుకు పోవడంతో ఇతడికి అవకాశాలు లభించలేదు. 17 ఇన్నింగ్స్ ల్లో బ్యాటింగ్ దిగిన అతడు గతంలో ఎన్నడూ లేని రీతిలో కొలంబో టీ20లో భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు.
Samayam Telugu dk


తీవ్ర ఒత్తిడి మధ్య క్రీజులోకి అడుగుపెట్టిన కార్తీక్ ఏ మాత్రం రెండో ఆలోచనకు తావివ్వకుండా బౌండరీల మోత మోగించాడు. ఆఖరి బంతికి ఐదు పరుగులు అవసరమైన దశలో.. కవర్స్ మీదుగా అద్భుతమైన సిక్స్ తో జట్టును గెలిపించాడు.
తీవ్ర ఒత్తిడిలోనూ ప్రశాంతంగా ఆడటం ఎలా సాధ్యమైందని మ్యాచ్ అనంతరం దినేశ్ కార్తీక్ ను ప్రశ్నించగా.. ఈ తరహా ఆటను ధోనీ నుంచి నేర్చుకున్నానని చెప్పాడు. ఒత్తిడిలోనూ ప్రశాంతంగా ఆడటం అనుభవం వల్లే సాధ్యమైందని కార్తీక్ చెప్పాడు. తీవ్ర ఉత్కంఠలోనూ ప్రశాంతంగా ఉంటూ మ్యాచ్ ను ఎలా ముగించాలో ధోనీని చూసి నేర్చుకున్నానని చెప్పాడు. గత కొన్నాళ్లుగా భారీ షాట్లు ఆడటం కసరత్తు చేస్తున్నానని, సపోర్టింగ్ స్టాఫ్ తనకెంతగానో సహకరించారని కార్తీక్ చెప్పాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.