యాప్నగరం

జడేజా, అశ్విన్‌లు ఇక టెస్టులకేనా..?

సీనియర్ స్పిన్నర్లు రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్‌లు ఇక టెస్టు మ్యాచ్‌లకే పరిమితంకానున్నారా..? అంటే అవుననేలా ఉన్నాయి భారత

TNN 24 Dec 2017, 3:38 pm
సీనియర్ స్పిన్నర్లు రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్‌లు ఇక టెస్టు మ్యాచ్‌లకే పరిమితంకానున్నారా..? అంటే అవుననేలా ఉన్నాయి భారత సెలక్టర్ల నిర్ణయాలు. గత కొద్ది సిరీస్‌లు‌గా వన్డే, టీ20 జట్టులో స్థానం కోల్పోతున్న ఈ స్పిన్ ద్వయానికి శనివారం రాత్రి కూడా సెలక్టర్లు మొండిచేయి చూపారు. దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా ఫిబ్రవరి 1 నుంచి భారత్ జట్టు ఆరు వన్డేల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌ కోసం 17 మంది సభ్యులతో కూడిన జట్టుని శనివారం రాత్రి సెలక్టర్లు ప్రకటించారు. కానీ.. ఇందులో అశ్విన్, జడేజా చోటు దక్కలేదు.
Samayam Telugu ashwin jadejas absence continues for south africa odis
జడేజా, అశ్విన్‌లు ఇక టెస్టులకేనా..?


గత కొద్దినెలలుగా మణికట్టు స్పిన్నర్లు చాహల్, కుల్దీప్ యాదవ్‌లు వన్డే, టీ20 జట్టులో మెరుగ్గా రాణిస్తుండటంతో సెలక్టర్లు మరోసారి వారిపై నమ్మకం ఉంచారు. అశ్విన్, జడేజా‌లను పక్కన పెట్టడంపై చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ మాట్లాడుతూ ‘యువ స్పిన్నర్లతో ప్రస్తుతం జట్టులో ప్రయోగాలు చేస్తున్నాం. వారు కూడా తమకి దొరికిన అవకాశాల్ని చక్కగా సద్వినియోగం చేసుకుని మ్యాచ్‌ల్ని గెలిపిస్తున్నారు. అందుకే వారిని మరికొంతకాలం జట్టుతో కొనసాగించాలని నిర్ణయించాం’ అని వివరించారు. దక్షిణాఫ్రికాతో జనవరి 5 నుంచి జరగనున్న టెస్టు సిరీస్‌ కోసం ఎంపిక చేసిన జట్టులో అశ్విన్, జడేజాలకి చోటు దక్కిన విషయం తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.