యాప్నగరం

ఇంగ్లాండ్‌ పిచ్‌లపై అవగాహన ముఖ్యం..!

ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న భారత జట్టుకి ఆగస్టు 1 నుంచి కఠిన సవాల్ ఎదురుకానుంది. ఇప్పటికే మూడు టీ20ల సిరీస్‌ను 2-1తో

Samayam Telugu 20 Jul 2018, 7:27 pm
ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న భారత జట్టుకి ఆగస్టు 1 నుంచి కఠిన సవాల్ ఎదురుకానుంది. మూడు టీ20ల సిరీస్‌ను 2-1తో గెలిచిన టీమిండియా.. వన్డే సిరీస్‌ను మాత్రం పేలవరీతిలో 1-2తో చేజార్చుకుంది. ఈ నేపథ్యంలో ఆగస్టు మొదటి వారం నుంచి జరగనున్న ఐదు టెస్టుల సిరీస్‌లో భారత్‌ ప్రదర్శనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Samayam Telugu Ashwin-AP12


ఇప్పటికే టెస్టు సిరీస్‌ కోసం భారత సెలక్టర్లు జట్టుని ప్రకటించగా.. అనూహ్యంగా అందులో అశ్విన్, జడేజా, కుల్దీప్ యాదవ్ రూపంలో ముగ్గురు ప్రొఫెషనల్ స్పిన్నర్లకి చోటిచ్చారు. ఏడాదికాలంగా కుల్దీప్ యాదవ్, చాహల్ జోరుతో వన్డే, టీ20ల్లో చోటు కోల్పోయిన అశ్విన్, జడేజాలు కనీసం టెస్టుల్లోనైనా తమ స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలంటే ఈ పర్యటనలో మెరుగ్గా రాణించాల్సిన సంకటస్థితి ఏర్పడింది.

జట్టులో పోటీపెరగడంపై అశ్విన్ మాట్లాడుతూ ‘భారత జట్టులో పోటీపెరిగిన నేపథ్యంలో.. నిరూపించుకోవడానికి ఎక్కువ అవకాశాలు దొరకవు. నా వరకు.. ఇంగ్లాండ్‌ పిచ్‌లపై మంచి అవగాహన ఉంది. ఇక్కడ మ్యాచ్‌లు ఆడటాన్ని బాగా ఆస్వాదిస్తా. పరిస్థితుల్ని అర్థం చేసుకోవడం.. మ్యాచ్ గమనానికి అనుగుణంగా బౌలింగ్ చేయడం ఇంగ్లాండ్‌లో కీలకం. టెస్టుల్లో అత్యుత్తమ ప్రదర్శన చేసేందుకు ప్రయత్నిస్తా’ అని అశ్విన్ వెల్లడించాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.