యాప్నగరం

రిటైర్మెంట్ టైమ్ ప్రకటించేసిన అశ్విన్

టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన రిటైర్మెంట్ టైమ్ ప్రకటించేశాడు. కెరీర్‌లో 618 వికెట్ల మైలురాయిని

TNN 21 Oct 2017, 2:31 pm
టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన రిటైర్మెంట్ టైమ్ ప్రకటించేశాడు. కెరీర్‌లో 618 వికెట్ల మైలురాయిని అందుకున్న అనంతరం టెస్టు క్రికెట్‌కి శాశ్వతంగా వీడ్కోలు పలుకుతానని వెల్లడించాడు. భారత తరఫున స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే టెస్టు‌ల్లో 619 వికెట్లు పడగొట్టి అగ్రస్థానంలో ఉన్నాడని.. అతని రికార్డుని బ్రేక్ చేయడం తనకి ఇష్టం లేదని ఈ ఆఫ్ స్పిన్నర్ స్పష్టం చేశాడు. శ్రీలంక, ఆస్ట్రేలియాతో వన్డే, టీ20 సిరీస్‌లతో పాటు న్యూజిలాండ్‌తో ఆదివారం నుంచి జరగనున్న వన్డే సిరీస్‌కి కూడా అశ్విన్‌ని సెలక్టర్లు పక్కన పెట్టిన విషయం తెలిసిందే.
Samayam Telugu ashwin wants to retire when he reaches 618 test wickets
రిటైర్మెంట్ టైమ్ ప్రకటించేసిన అశ్విన్


‘అనిల్ కుంబ్లేకి నేను పెద్ద అభిమానిని. అతను టెస్టుల్లో 619 వికెట్లు సాధించి భారత్ తరఫున నెం.1 స్థానంలో ఉన్నాడు. నేను ఒకవేళ టెస్టు కెరీర్‌లో 618 వికెట్లు పడగొడితే.. అతనికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఆ 618 వికెట్ల మైలురాయిని అందుకున్నమ్యాచే నా కెరీర్‌లో చివరి టెస్టు. ఆ మ్యాచ్‌లోనే రిటైర్మెంట్ ప్రకటించేస్తా’ అని అశ్విన్ వెల్లడించాడు. కెరీర్‌లో 132 టెస్టు మ్యాచ్‌లాడిన అనిల్ కుంబ్లే.. 619 వికెట్లు పడగొట్టగా.. ప్రస్తుతం 52 టెస్టులాడిన అశ్విన్ 292 వికెట్లతో కొనసాగుతున్నాడు. యువ స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, చాహల్ మెరుగ్గా రాణిస్తుండటంతో అశ్విన్‌తో పాటు జడేజాకి కూడా సెలక్టర్లు గత మూడు సిరీస్‌లుగా మొండిచేయి చూపుతున్నారు. ప్రస్తుతం ఈ ఇద్దరు సీనియర్ స్పిన్నర్లు దేశవాళీ క్రికెట్‌.. రంజీల్లో ఆడుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.