యూఏఈ వేదికగా సెప్టెంబరు 15 నుంచి జరగనున్న ఆసియా కప్ కోసం భారత సెలక్టర్లు 16మందితో కూడిన జట్టుని శనివారం ప్రకటించారు. రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి విశ్రాంతినిచ్చిన సెలక్టర్లు.. అతని స్థానంలో జట్టు కెప్టెన్గా రోహిత్ శర్మని నియమించారు. ఇటీవల యో-యో టెస్టులో పాసైన అంబటి రాయుడు, కేదార్ జాదవ్ మళ్లీ భారత జట్టులోకీ రీఎంట్రీ ఇవ్వగా.. కీలకమైన ఈ సిరీస్ కోసం యువ ఫాస్ట్ బౌలర్ ఖలీల్ అహ్మద్ను జట్టులోకి తీసుకోవడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. భారత- ఎ జట్టు తరఫున మెరుగ్గా రాణించిన ఈ ఎడమ చేతి వాటం ఫాస్ట్ బౌలర్.. అనూహ్యంగా సెలక్టర్ల దృష్టిలో పడ్డాడు.
పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ లాంటి జట్లు పోటీపడుతున్న ఆసియా కప్లో విరాట్ కోహ్లీకి విశ్రాంతినివ్వడం, యువ బౌలర్కి ఛాన్సివ్వడంపై భారత చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ‘2019 ప్రపంచకప్ కోసం జట్టుని సిద్ధం చేస్తున్నాం. ఈ క్రమంలో ఇంకా జట్టులోని రెండు మూడు స్థానాలను మెరుగైన ఆటగాళ్లతో భర్తీ చేయాల్సి ఉంది. అందులో ఒకటి ఎడమ చేతి వాటం ఫాస్ట్ బౌలర్ స్థానం. అందుకే ఖలీల్ అహ్మద్ని జట్టులోకి ఎంపిక చేసి పరీక్షించదలిచాం. ఇక కెప్టెన్ విరాట్ కోహ్లీపై పనిభారం తగ్గించేందుకే విశ్రాంతినిచ్చాం. మూడు ఫార్మాట్లలోనూ అతను సుదీర్ఘంగా క్రికెట్ ఆడుతున్నాడు. అందుకే.. అతనికి కొంచెం విశ్రాంతినివ్వాలని జట్టులోకి ఎంపిక చేయలేదు’ అని ఎమ్మెస్కే ప్రసాద్ స్పష్టం చేశారు.
ఆసియా కప్ కోసం ఎంపిక చేసిన జట్టు : రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, అంబటి రాయుడు, మనీశ్ పాండే, కేదార్ జాదవ్, ఎంఎస్ ధోని (వికెట్ కీపర్), దినేష్ కార్తీక్, హార్దిక్ పాండ్య, కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చహల్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రిత్ బుమ్రా, శార్దూల్ ఠాకూర్, ఖలీల్ అహ్మద్.
పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ లాంటి జట్లు పోటీపడుతున్న ఆసియా కప్లో విరాట్ కోహ్లీకి విశ్రాంతినివ్వడం, యువ బౌలర్కి ఛాన్సివ్వడంపై భారత చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ‘2019 ప్రపంచకప్ కోసం జట్టుని సిద్ధం చేస్తున్నాం. ఈ క్రమంలో ఇంకా జట్టులోని రెండు మూడు స్థానాలను మెరుగైన ఆటగాళ్లతో భర్తీ చేయాల్సి ఉంది. అందులో ఒకటి ఎడమ చేతి వాటం ఫాస్ట్ బౌలర్ స్థానం. అందుకే ఖలీల్ అహ్మద్ని జట్టులోకి ఎంపిక చేసి పరీక్షించదలిచాం. ఇక కెప్టెన్ విరాట్ కోహ్లీపై పనిభారం తగ్గించేందుకే విశ్రాంతినిచ్చాం. మూడు ఫార్మాట్లలోనూ అతను సుదీర్ఘంగా క్రికెట్ ఆడుతున్నాడు. అందుకే.. అతనికి కొంచెం విశ్రాంతినివ్వాలని జట్టులోకి ఎంపిక చేయలేదు’ అని ఎమ్మెస్కే ప్రసాద్ స్పష్టం చేశారు.
ఆసియా కప్ కోసం ఎంపిక చేసిన జట్టు : రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, అంబటి రాయుడు, మనీశ్ పాండే, కేదార్ జాదవ్, ఎంఎస్ ధోని (వికెట్ కీపర్), దినేష్ కార్తీక్, హార్దిక్ పాండ్య, కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చహల్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రిత్ బుమ్రా, శార్దూల్ ఠాకూర్, ఖలీల్ అహ్మద్.