యాప్నగరం

భారత్ జోరుతో పాక్‌ కెప్టెన్‌కి నిద్ర కరవు..!

పాక్ జట్టుకి ఎవరు కెప్టెన్‌గా ఉన్నా.. వారి వెంట ఒత్తిడి ఉండనే ఉంటుంది. మరీ ముఖ్యంగా.. జట్టు వరుసగా పరాజయాల్ని చవిచూస్తున్నప్పుడు అది రెట్టింపవుతుంది.

Samayam Telugu 27 Sep 2018, 9:24 pm
ఆసియా కప్‌లోకి భారీ అంచనాల మధ్య అడుగుపెట్టిన పాకిస్థాన్ టీమ్.. పేలవ ఓటములతో సూపర్-4 దశలోనే టోర్నీ నుంచి బుధవారం నిష్క్రమించింది. ముఖ్యంగా.. టీమిండియా చేతిలో గ్రూప్ దశలో ఒకసారి, సూపర్-4 దశలో రెండోసారి చిత్తుగా ఓడింది. దీంతో.. ఆ జట్టు కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్‌‌కి గత ఆరు రోజులుగా నిద్ర కరవైందట. ఈ విషయాన్ని స్వయంగా సర్ఫరాజ్ అహ్మదే మీడియాతో గురువారం వెల్లడించాడు.
Samayam Telugu asia cup 2018 i did not sleep for six days says sarfraz ahmed
భారత్ జోరుతో పాక్‌ కెప్టెన్‌కి నిద్ర కరవు..!


టోర్నీ ఫైనల్‌కి చేరాలంటే నిన్న బంగ్లాదేశ్‌పై తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో పాకిస్థాన్ 37 పరుగుల తేడాతో ఓడిన విషయం తెలిసిందే. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లోనూ పేలవ ప్రదర్శన కనబర్చిన పాకిస్థాన్ ఏ దశలోనూ బంగ్లాదేశ్‌కి పోటీనివ్వలేకపోయింది. దీంతో.. నిన్న మ్యాచ్‌లో గెలిచిన బంగ్లాదేశ్ నేరుగా ఫైనల్‌కి వెళ్లిపోగా.. రేపు భారత్‌తో తుది పోరులో ఢీకొట్టనుంది.

‘కెప్టెన్సీ అనేది ఎప్పుడూ ఒత్తిడితో కూడుకున్నదే. పాక్ జట్టుకి ఎవరు కెప్టెన్‌గా ఉన్నా.. వారి వెంట ఒత్తిడి ఉండనే ఉంటుంది. మరీ ముఖ్యంగా.. జట్టు వరుసగా పరాజయాల్ని చవిచూస్తున్నప్పుడు అది రెట్టింపవుతుంది. మీరు నమ్మరు కానీ.. నేను గత ఆరు రోజులుగా నిద్రపోలేదు. అయితే ఇవన్నీ జీవితంలో ఓ భాగమే’ అని సర్ఫరాజ్ అహ్మద్ వెల్లడించాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.