యాప్నగరం

Ravindra Jadeja: ఏడాది తర్వాత వన్డేల్లోకి జడేజా రీఎంట్రీ..!

గత ఏడాది జూలైలో వెస్టిండీస్‌పై చివరి వన్డే ఆడిన రవీంద్ర జడేజా.. ఆ మ్యాచ్‌లో మొత్తం 10 ఓవర్లు బౌలింగ్ చేసి 0/27తో నిరాశపరిచాడు.

Samayam Telugu 21 Sep 2018, 5:32 pm
భారత స్పిన్నర్ రవీంద్ర జడేజా మళ్లీ వన్డేల్లోకి పునరాగమనం చేశాడు. గత ఏడాదికాలంగా మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అత్యుత్తమంగా రాణిస్తుండటంతో.. వన్డే, టీ20 జట్టుకి దూరమైన జడేజా కేవలం టెస్టులు మాత్రమే ఆడుతున్నాడు. అయితే.. గత బుధవారం ఆసియా కప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ ఎడమచేతి వాటం స్పిన్నర్ అక్షర్ పటేల్ గాయపడటంతో అతని స్థానంలో అనూహ్యంగా రవీంద్ర జడేజాకి అవకాశం దక్కింది.
Samayam Telugu asia cup 2018 ravindra jadeja returns to odi cricket after 14 months
Ravindra Jadeja: ఏడాది తర్వాత వన్డేల్లోకి జడేజా రీఎంట్రీ..!


దుబాయ్ వేదికగా ఈరోజు బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌..‌ తుది జట్టులో ఒక మార్పు చేసిన కెప్టెన్ రోహిత్ శర్మ.. గాయపడిన హార్దిక్ పాండ్యా స్థానంలో రవీంద్ర జడేజాకి చోటిచ్చాడు. గత ఏడాది జూలైలో వెస్టిండీస్‌తో జరిగిన వన్డేలో చివరిసారిగా ఆడిన రవీంద్ర జడేజా.. ఆ మ్యాచ్‌లో మొత్తం 10 ఓవర్లు బౌలింగ్ చేసి 0/27తో నిరాశపరిచాడు. ఆ తర్వాత.. జరిగిన టీ20 మ్యాచ్‌లోనూ 3.3 ఓవర్లు వేసి ఏకంగా 41 పరుగులు సమర్పించుకోవడంతో అతడ్ని సెలక్టర్లు పక్కన పెడుతూ వచ్చారు. దీనికి తోడు మణికట్టు స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్ (ఎడమ చేతి వాటం స్పిన్నర్), చాహల్ మెరుగ్గా రాణించడంతో జడేజా ఏడాదికాలం పరిమిత ఓవర్ల క్రికెట్‌కి దూరమవ్వాల్సి వచ్చింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.