యాప్నగరం

జట్టులో ధోనీ ఉండటం రోహిత్ అదృష్టం..!

మ్యాచ్‌ల్లో ఏదైన క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు.. సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ధోనీ ప్రస్తుతం జట్టులో ఉండటం అతని అదృష్టం

Samayam Telugu 18 Sep 2018, 3:00 pm
ఆసియా కప్‌కి ఎంపిక చేసిన భారత జట్టులో మహేంద్రసింగ్ ధోనీ ఉండటం తాత్కాలిక కెప్టెన్ రోహిత్ శర్మ అదృష్టమని దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. టోర్నీలో భాగంగా భారత జట్టు ఈరోజు సాయంత్రం హాంకాంగ్‌తో తొలి మ్యాచ్ ఆడనుండగా.. రెగ్యులర్ కెప్టెన్‌ విరాట్ కోహ్లీకి ఈ టోర్నీ నుంచి సెలక్టర్లు విశ్రాంతినిచ్చిన విషయం తెలిసిందే. దీంతో.. కోహ్లీ లేని లోటు తెలియకుండా ధోనీ సాయంతో రోహిత్ శర్మ జట్టుని నడిపించాలని గవాస్కర్ సూచించాడు. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో రేపు భారత జట్టు రెండో మ్యాచ్ ఆడనుంది.
Samayam Telugu RohitSharmaODICaptain2


‘భారత్ జట్టు ప్రస్తుతం సీనియర్లు, జూనియర్లతో మంచి సమతూకంగా కనిపిస్తోంది. దీనికి తోడు వన్డేలంటే అమితంగా ఇష్టపడే రోహిత్ శర్మ కెప్టెన్‌గా జట్టుని ముందుండి నడిపించనున్నాడు. ఈ టోర్నీలో కనీసం రెండు శతకాలను సాధించాలని అతను ఆశిస్తున్నాడు. మ్యాచ్‌ల్లో ఏదైన క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు.. సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ధోనీ ప్రస్తుతం జట్టులో ఉండటం అతని అదృష్టం. జట్టుకి ధోనీ అనుభవం వెలకట్టలేని ఆస్తి. బౌలింగ్‌ సమయంలో అతనిచ్చే సలహాలు స్పిన్నర్లకి లాభించనున్నాయి’ అని గవాస్కర్ వెల్లడించాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.