భారత్లో ఈ ఏడాది జరగనున్న ఐపీఎల్ 2020 సీజన్ని అడ్డుకునేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) పావులు కదుపుతోంది. ఆస్ట్రేలియా వేదికగా ఈ ఏడాది అక్టోబరు 18 నుంచి నవంబరు 15 వరకూ టీ20 వరల్డ్కప్ జరగాల్సి ఉండగా.. కరోనా వైరస్ కారణంగా ఆ టోర్నీని వాయిదావేయాలని ఐసీసీ యోచిస్తోంది. దాంతో.. సెప్టెంబరు- నవంబరు మధ్యలో ఐపీఎల్ 2020 సీజన్ని నిర్వహించాలని బీసీసీఐ ప్లాన్ చేస్తోంది. కానీ.. మధ్యలో ఆసియా కప్ని తెరపైకి తీసుకురావడం ద్వారా పాకిస్థాన్.. ఐపీఎల్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది. ఒకవేళ ఐపీఎల్ 2020 సీజన్ రద్దయితే బీసీసీఐ సుమారు రూ.4వేల కోట్లు నష్టపోనుంది.
ఆసియా కప్ 2020 టోర్నీ ఆతిథ్య హక్కులు ప్రస్తుతం పాకిస్థాన్ వద్ద ఉండగా.. సెప్టెంబరు - అక్టోబరులో షెడ్యూల్ ప్రకారం ఆ టోర్నీ జరగాల్సి ఉంది. కానీ.. పాకిస్థాన్కి వెళ్లి ఆసియా కప్ ఆడబోమని స్పష్టం చేసిన భారత్.. తటస్థ వేదికలో అయితే ఓకే చెప్పింది. దాంతో.. శ్రీలంక లేదా యూఏఈలో ఆ టోర్నీని నిర్వహించేందుకు ఉన్న అనువైన మార్గాల్ని పరిశీలించిన పీసీబీ.. కరోనా వైరస్ కారణంగా ఆ టోర్నీ నిర్వహణపై ఎటూ తేల్చుకోలేక మిన్నకుండిపోయింది. కానీ.. తాజాగా ఐపీఎల్కి మార్గం సుగుమం కావడంతో కొత్త పల్లవి అందుకుంది. షెడ్యూల్ ప్రకారమే ఆసియా కప్ జరుగుతుందంటూ పీసీబీ సీఈవో వసీమ్ ఖాన్ తాజాగా స్పష్టం చేశాడు.
‘‘ఆసియా కప్ ఈ ఏడాది తప్పకుండా జరుగుతుంది. ఇంగ్లాండ్ టూర్కి ఈ నెలలో వెళ్లనున్న పాకిస్థాన్ క్రికెట్ జట్టు.. సెప్టెంబరు 2న స్వదేశానికి వస్తుంది. కాబట్టి.. సెప్టెంబరు లేదా అక్టోబరులో ఆసియా కప్ని నిర్వహిస్తాం. శ్రీలంకలో కరోనా వైరస్ కేసులు చాలా తక్కువగా నమోదయ్యాయి. ఒకవేళ ఆసియా కప్ ఆతిథ్యానికి ఆ దేశం ఒప్పుకోకపోతే.. యుఏఈ సిద్ధంగా ఉంది’’ అని వసీమ్ ఖాన్ వెల్లడించాడు.
ఆసియా కప్ 2020 టోర్నీ ఆతిథ్య హక్కులు ప్రస్తుతం పాకిస్థాన్ వద్ద ఉండగా.. సెప్టెంబరు - అక్టోబరులో షెడ్యూల్ ప్రకారం ఆ టోర్నీ జరగాల్సి ఉంది. కానీ.. పాకిస్థాన్కి వెళ్లి ఆసియా కప్ ఆడబోమని స్పష్టం చేసిన భారత్.. తటస్థ వేదికలో అయితే ఓకే చెప్పింది. దాంతో.. శ్రీలంక లేదా యూఏఈలో ఆ టోర్నీని నిర్వహించేందుకు ఉన్న అనువైన మార్గాల్ని పరిశీలించిన పీసీబీ.. కరోనా వైరస్ కారణంగా ఆ టోర్నీ నిర్వహణపై ఎటూ తేల్చుకోలేక మిన్నకుండిపోయింది. కానీ.. తాజాగా ఐపీఎల్కి మార్గం సుగుమం కావడంతో కొత్త పల్లవి అందుకుంది. షెడ్యూల్ ప్రకారమే ఆసియా కప్ జరుగుతుందంటూ పీసీబీ సీఈవో వసీమ్ ఖాన్ తాజాగా స్పష్టం చేశాడు.
‘‘ఆసియా కప్ ఈ ఏడాది తప్పకుండా జరుగుతుంది. ఇంగ్లాండ్ టూర్కి ఈ నెలలో వెళ్లనున్న పాకిస్థాన్ క్రికెట్ జట్టు.. సెప్టెంబరు 2న స్వదేశానికి వస్తుంది. కాబట్టి.. సెప్టెంబరు లేదా అక్టోబరులో ఆసియా కప్ని నిర్వహిస్తాం. శ్రీలంకలో కరోనా వైరస్ కేసులు చాలా తక్కువగా నమోదయ్యాయి. ఒకవేళ ఆసియా కప్ ఆతిథ్యానికి ఆ దేశం ఒప్పుకోకపోతే.. యుఏఈ సిద్ధంగా ఉంది’’ అని వసీమ్ ఖాన్ వెల్లడించాడు.