యాప్నగరం

Pat Cummins: అత్యవసరంగా సద్వేశానికి వెళ్లిపోయిన ఆస్ట్రేలియా కెప్టెన్

Pat Cummins: భారత్‌తో రెండో టెస్ట్ ముగిసిన తర్వాత ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ సిడ్నీ బయల్దేరి వెళ్లాడు. కుటుంబ సభ్యుల అనారోగ్యం కారణంగా అతడు స్వదేశానికి వెళ్లాడని తెలుస్తోంది. ఇండోర్ టెస్టు ప్రారంభానికి ముందు అతడు తిరిగి ఇండియాకు వచ్చేయనున్నాడు. ఒకవేళ కమిన్స్ రాలేకపోతే.. ఆసీస్ జట్టును స్టీవ్ స్మిత్ ముందుకు నడిపించనున్నాడు. ప్రధాన పేసర్ జోష్ హేజిల్‌వుడ్ సైతం గాయం నుంచి కోలుకోలేకపోవడంతో స్వదేశానికి బయల్దేరి వెళ్లాడు.

Authored byరవి కుమార్ | Samayam Telugu 20 Feb 2023, 3:08 pm
భారత పర్యటనలో ఉన్న ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ అత్యవసరంగా స్వదేశానికి బయల్దేరి వెళ్లాడు. కుటుంబ సభ్యుల అనారోగ్యం కారణంగానే కమిన్స్ స్వదేశానికి బయల్దేరి వెళ్లాడని తెలుస్తోంది. ఆదివారం సిడ్నీ బయల్దేరి వెళ్లిన కమిన్స్.. మూడో టెస్టు ప్రారంభంలోగా భారత్ తిరిగొచ్చే అవకాశం ఉంది. సిడ్నీలో ఉన్నప్పటికీ కమిన్స్ ఆటగాళ్లతో టచ్‌లో ఉంటాడని.. ఇండో టెస్టు కోసం ప్లానింగ్‌లోనూ భాగంగా ఉంటాడని ఆసీస్ కోచ్ మెక్‌డొనాల్డ్ తెలిపారు.
Samayam Telugu Pat Cummins
Pat Cummins


మరో వైపు పేసర్ జోష్ హేజిల్‌వుడ్ గాయం కారణంగా భారత పర్యటనకు దూరమయ్యాడు. దీంతో హెజిల్‌వుడ్ కూడా రీహాబిలిటేషన్ కోసం ఆస్ట్రేలియా తిరిగి వెళ్లాడని ఆ జట్టు కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ తెలిపారు. హేజిల్‌వుడ్ ఇటీవల ట్రైనింగ్ సెషన్లో పాల్గొన్నప్పటికీ.. తొలి రెండు టెస్టుల్లో ఆడలేదు.

ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్, మిచెల్ స్టార్క్ ఆస్ట్రేలియా జట్టులో చేరే అవకాశం ఉంది. మూడో టెస్టు నాటికి గ్రీన్ నూరు శాతం ఫిట్‌నెస్ సాధిస్తాడని కోచ్ తెలిపాడు. గ్రీన్, స్టార్క్ ఇద్దరికీ వేలి గాయాలైన సంగతి తెలిసిందే.

ఒక వేళ కమిన్స్ మూడో టెస్టు ప్రారంభంలోగా భారత్ తిరిగి రాలేకపోతే.. వైస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ జట్టును ముందుకు నడిపే అవకాశం ఉంది. 2021లో కమిన్స్ కెప్టెన్సీ పగ్గాలు చేపట్టాక.. అతడు అందుబాటులోని లేని రెండు సందర్భాల్లో స్మిత్ జట్టుకు నాయకత్వం వహించాడు.

భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్టు ఇండోర్ వేదికగా మార్చి 1న ప్రారంభం అవుతుంది. ఇప్పటికే రెండు టెస్టుల్లో గెలిచిన టీమిండియా బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో 2-0 ఆధిక్యంలో ఉంది. మార్చి 9న ఇరు జట్ల మధ్య చివరిదైన నాలుగో టెస్టు ప్రారంభం అవుతుంది.
రచయిత గురించి
రవి కుమార్
రవి కుమార్ సమయం తెలుగులో ప్రిన్సిపల్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. స్పోర్ట్స్, ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 12 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, ఎడ్యుకేషన్ సంబంధింత అంశాలను అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.