చెపాక్లో ఆసీస్ టార్గెట్ 21 ఓవర్లలో 164
చెపాక్ వేదికగా ఆదివారం భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న తొలి వన్డే.. వర్షంతో టీ20 మ్యాచ్లాగా మారిపోయింది.
TNN 17 Sep 2017, 8:38 pm
చెపాక్ వేదికగా ఆదివారం భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న తొలి వన్డే.. వర్షంతో టీ20 మ్యాచ్లాగా మారిపోయింది. దాదాపు మూడు గంటల మ్యాచ్ సమయం వృథా కావడంతో అంపైర్లు లక్ష్యాన్ని, ఓవర్లని భారీగా కుదించారు. అంతకముందు హార్దిక్ పాండ్య (83: 66 బంతుల్లో 5x4, 5x6), మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని (79: 88 బంతుల్లో 4x4, 2x6) దూకుడుగా ఆడటంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 281 పరుగులు చేసింది.
టీమిండియా ఇన్నింగ్స్ అనంతరం భారీగా వర్షం మొదలైంది. మధ్యలో ఒకసారి వర్షం తగ్గి ఆటగాళ్లు మైదానంలోకి వచ్చినా.. ఒక బంతి కూడా పడకుండానే మళ్లీ వరణుడు పునరాగమనం చేయడంతో ఆటగాళ్లు పెవిలియన్కి వెళ్లిపోయారు. తాజాగా ఆస్ట్రేలియా లక్ష్యాన్ని 21 ఓవర్లలో 164 పరుగులుగా అంపైర్లు నిర్ణయించారు.
టీమిండియా ఇన్నింగ్స్ అనంతరం భారీగా వర్షం మొదలైంది. మధ్యలో ఒకసారి వర్షం తగ్గి ఆటగాళ్లు మైదానంలోకి వచ్చినా.. ఒక బంతి కూడా పడకుండానే మళ్లీ వరణుడు పునరాగమనం చేయడంతో ఆటగాళ్లు పెవిలియన్కి వెళ్లిపోయారు. తాజాగా ఆస్ట్రేలియా లక్ష్యాన్ని 21 ఓవర్లలో 164 పరుగులుగా అంపైర్లు నిర్ణయించారు.