యాప్నగరం

వన్డేల్లో 34 ఏళ్ల తర్వాత మళ్లీ ఆసీస్ పతనం

వన్డేల్లో తిరుగులేని ప్రదర్శనతో క్రికెట్ ప్రపంచాన్ని ఏలిన ఆస్ట్రేలియా జట్టు ఇటీవల బాల్ టాంపరింగ్ వివాదంతో ఇంటా బయట పరువు

Samayam Telugu 18 Jun 2018, 4:01 pm
వన్డేల్లో తిరుగులేని ప్రదర్శనతో క్రికెట్ ప్రపంచాన్ని ఏలిన ఆస్ట్రేలియా జట్టు ఇటీవల బాల్ టాంపరింగ్ వివాదంతో ఇంటా బయట పరువు పోగొట్టుకుంది. తాజాగా ఇంగ్లాండ్ గడ్డపై పేలవ ప్రదర్శనతో వరుసగా రెండు వన్డేల్లోనూ ఓడిన ఆ జట్టు 34 ఏళ్ల తర్వాత వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్-5 స్థానాన్ని చేజార్చుకుంది. ఐసీసీ సోమవారం ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్‌లో 102 పాయింట్లతో ఆస్ట్రేలియా జట్టు ఆరో స్థానానికి దిగజరాగా.. 124 పాయింట్లతో ఇంగ్లాండ్ అగ్రస్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ఈ జాబితాలో భారత్ (122 పాయింట్లు) రెండో స్థానంలో ఉండగా.. తర్వాత వరుసగా దక్షిణాఫ్రికా (113), న్యూజిలాండ్ (112), పాకిస్థాన్ (102) నిలిచాయి. చివరిసారిగా 1984, జనవరిలో ఆస్ట్రేలియా జట్టు వన్డే ర్యాంకింగ్స్‌లో ఆరోస్థానంలో నిలిచింది.
Samayam Telugu ..


ఇంగ్లాండ్‌తో ఐదు వన్డేల సిరీస్‌‌లో భాగంగా గత బుధవారం జరిగిన తొలి వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు 214 పరుగులకి ఆలౌటవగా.. లక్ష్యాన్ని 44 ఓవర్లలోనే ఇంగ్లాండ్ జట్టు ఛేదించి 3 వికెట్ల తేడాతో అలవోక విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత గత శనివారం జరిగిన రెండో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు 342 పరుగులు చేయగా.. లక్ష్య ఛేదనలో తడబడిన ఆస్ట్రేలియా జట్టు 304 పరుగులకే ఆలౌటైంది. మూడో వన్డే మంగళవారం ట్రెంట్‌బ్రిడ్జ్ వేదికగా జరగనుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.